CM Chandrababu in Delhi: హస్తినలో ఏపీ సీఎం బిజీబిజీ
- ఢిల్లీలో బిజీబిజీగా ఏపీ సీఎం చంద్రబాబు..
- కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జయశంకర్ తో భేటీ..
- నేడు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక శత వార్షిక వేడుకలలో పాల్గొననున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu in Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో శుక్రవారం భేటీ అయ్యారు.. రాష్ట్ర జీఎస్టీ సంబంధిత సర్చార్జి ఒక శాతం పెంచవలసిందిగా కోరారు ఏపీ సీఎం.. ఇక, గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. నదుల అనుసంధానంతో వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్ లోని క్షామ పీడిత ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు త్రాగు, సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు..
Read Also: CM Revanth Reddy: నేడు మరోసారి మహారాష్ట్రకు సీఎం.. రెండు రోజులు షెడ్యూల్ ఇదే..
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
ఇక, అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు మరియు భారత ఆర్థిక రంగంపై ప్రభావం గూర్చి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించడానికి వెళ్తుండడంతో వారిపై అమెరికా నూతన ప్రభుత్వ విధానాల ప్రభావం గూర్చి చర్చించారు. దేశ ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి.. పెట్టుబడులు ఆకర్షించడంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ సహకారాలను కోరారు.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ సమస్యలను విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెవెళ్లారు. మరోవైపు.. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించమని కోరారు. ఇక, నేడు ఉదయం హిందుస్థాన్ టైమ్స్ పత్రిక శత వార్షిక వేడుకలలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!