CM Chandrababu in Delhi: హస్తినలో ఏపీ సీఎం బిజీబిజీ
- ఢిల్లీలో బిజీబిజీగా ఏపీ సీఎం చంద్రబాబు..
- కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జయశంకర్ తో భేటీ..
- నేడు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక శత వార్షిక వేడుకలలో పాల్గొననున్న సీఎం..
CM Chandrababu in Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో శుక్రవారం భేటీ అయ్యారు.. రాష్ట్ర జీఎస్టీ సంబంధిత సర్చార్జి ఒక శాతం పెంచవలసిందిగా కోరారు ఏపీ సీఎం.. ఇక, గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. నదుల అనుసంధానంతో వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్ లోని క్షామ పీడిత ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు త్రాగు, సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు..
Read Also: CM Revanth Reddy: నేడు మరోసారి మహారాష్ట్రకు సీఎం.. రెండు రోజులు షెడ్యూల్ ఇదే..
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
ఇక, అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు మరియు భారత ఆర్థిక రంగంపై ప్రభావం గూర్చి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించడానికి వెళ్తుండడంతో వారిపై అమెరికా నూతన ప్రభుత్వ విధానాల ప్రభావం గూర్చి చర్చించారు. దేశ ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి.. పెట్టుబడులు ఆకర్షించడంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ సహకారాలను కోరారు.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ సమస్యలను విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెవెళ్లారు. మరోవైపు.. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించమని కోరారు. ఇక, నేడు ఉదయం హిందుస్థాన్ టైమ్స్ పత్రిక శత వార్షిక వేడుకలలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!