AP Chief Secretary: ఈ నెల 30న సీఎస్ పదవీ విరమణ..! రేసులో సీనియర్ ఐఏఎస్
- ఈ నెల 30న సీఎస్ విజయానంద్ పదవీ విరమణ..
- సీఎస్ కు మరో మూడు నెలల కొనసాగింపు అంశంపై చర్చ..
- సీనియారిటీ లిస్ట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్..
- ప్రస్తుతం ఇరిగేషన్ అండ్ సీఎం స్పెషల్ సీఎస్ గా ఉన్న సాయి ప్రసాద్..
- కొత్త సీఎస్ విషయంలో ఇంకా రాని స్పష్టత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Chief Secretary: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో మూడు నెలల పాటు కొనసాగింపు ఇవ్వాలా లేదా కొత్త సీఎస్ను నియమించాలా అనే అంశంపై కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం చూస్తే ప్రస్తుత ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ మరియు సీఎం ఆఫీస్కు ప్రత్యేక సీఎస్గా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజయానంద్ రిటైర్ అయిన పక్షంలో సాయి ప్రసాద్కు సీఎస్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయతే, కొత్త సీఎస్ నియామకంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విజయానంద్ కొనసాగింపు అవకాశం ఉందా? లేక సాయి ప్రసాద్ కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తారా? అనే అంశంపై అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతున్నా.. ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..
Read Also: RGV-Rajamouli : ‘‘నాస్తికుడు వల్ల దేవుడి స్థాయి తగ్గదు” – జక్కన్న తరపున ఆర్జీవీ పంచ్ పోస్ట్ వైరల్
Also Read
- AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
- Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
- YS.Jagan: మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్
కాగా, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన కె.విజయానంద్ అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సీఎస్గా ఉన్న నీరబ్కుమార్ ప్రసాద్ పదవీ విరమణతో విజయానంద్ ఆ బాధ్యతలు తీసుకున్నారు.. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన విజయానంద్ 1993లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. సబ్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. ఏపీ ట్రాన్స్కో, జెన్కోలో ఉన్నత బాధ్యతలు నిర్వహించారు. 2019-21 మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశారు. 2023 నుంచి ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్గా సేవలు అందించారు. ఆ తర్వాత సీఎస్గా బాధ్యతలు తీసుకున్నారు.. అయితే, ఇప్పుడు విజయానంద్ను కొనసాగిస్తారా? కొత్త వారిని నియమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?