Site icon NTV Telugu

AP Cabinet Meeting: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై చర్చ!

Cabinet

Cabinet

AP Cabinet Meeting: సచివాలయంలో ఇవాళ (ఆగస్టు 6న) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే, నాలా చట్ట సవరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ భూమిని వ్యవసయేతర అవసరాల కోసం ఉపయోగించేందుకు నాలా చట్ట సవరణ చేయనున్నారు. ఎల్ఆర్ఎస్ పై కూడా మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఇక, కొత్త బార్ పాలసీపై ఏపీ కేబినెట్ లో చర్చ జరగనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ, ఫీజులు పెంచే విషయంలో మంత్ర వర్గం నిర్ణయం తీసుకోనుంది.

Read Also: Kishkindhapuri : ‘కిష్కింధపురి’ నుండి సాలిడ్ అప్డేట్.!

అలాగే, సీఎం అండ్ టీం సింగపూర్ టూర్ పై కేబినెట్ లో చర్చ జరగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు వివిధ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. లిక్కర్ స్కాంలో నగదు బయట పడడం, ఇప్పటికే జరిగిన అరెస్టులకు సంబంధించి మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇక, కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. దీంతో పాటు రాజధాని అమరావతి పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

Exit mobile version