AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గం ముందు కీలక అజెండా..
- నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ..
- పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ఈ భేటీలో.. రాష్ట్రానికి కీలకమైన పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
కేబినెట్ ముందు ఉండనున్న కీలక అంజెడా ఇదే..
* రాష్ట్రంలో పరిపాలనను మరింత వికేంద్రీకరించి ప్రజలకు సేవలు వేగంగా అందించాలన్న లక్ష్యంతో.. 3 కొత్త జిల్లాలు, పలు రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలపనుంది.
* అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.103.96 కోట్ల వ్యయంతో అధునాతన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇది రాష్ట్రాన్ని టెక్నాలజీ, రీసెర్చ్ హబ్గా మార్చే దిశగా మరో ముందడుగు కానుంది.
* సచివాలయ పరిధిలో ఉన్న అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు రూ.109 కోట్ల నిధుల కేటాయింపుకు ఆమోదం ఇవ్వనున్నారు.
* అమరావతి పరిధిలోని శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల భూమిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
* రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచేలా.. తుళ్లూరులో 6 ఎకరాల భూమిని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది.
* వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా.. 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో రూ.444 కోట్ల వ్యయంతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
* రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా.. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లే-అవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1358 కోట్ల నిధులు కేటాయింపుకు ఆమోదం తెలపనున్నారు.
* రాష్ట్రంలోని 202 ఎకరాల భూమి జరీబు (తడిభూమి) లేదా మెట్ట (పొడి భూమి) ప్రాంతమా అనే నిర్ధారణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది.
* పలు సంస్థలకు భూముల కేటాయింపు ప్రతిపాదనలకూ ఆమోదం తెలపనుంది కేబినెట్..
* ఋషికొండ నిర్మాణాల అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు..
* మెడికల్ కాలేజీ టెండర్లు, PPP విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఇవ్వనున్నారు
* తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి వ్యూహాలపై కేబినెట్లో సమీక్ష జరగనుంది..
* రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు, రాజధాని అమరావతి అభివృద్ధి, పరిశోధనా–విద్యా–ఆరోగ్య రంగాలకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగుతోంది.
Also Read
- Pawan Kalyan: నేషనల్ వార్ మెమోరియల్కు పవన్ కల్యాణ్.. వీర జవాన్లకు నివాళి.. ఫొటోలు..
- CM Chandrababu Singapore Visit: సింగపూర్లో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ..
- Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
- Jana Sena Five Key Resolutions: ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’.. ఐదు తీర్మానాలకు ఆమోదం
తాజావార్తలు
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?