AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సూపర్ సిక్స్కు గ్రీన్ సిగ్నల్..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ..
- మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. అందులో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిలో 100 పడకలు చేయడానికి కేబినెట్ నిర్ణయించిందన్నారు.. అమరావతిలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. కొత్త టెండర్లతో పనులు జరుగుతాయని వివరించారు మంత్రి పార్థసారథి.. A M R U D A చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం లో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు . పారిశ్రామిక వేత్తలు తమ పనులు సగంలో ఆపి వెళ్లిపోయారు. రుణాలు ఇచ్చే బ్యాంక్లు కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదన్నారు.. ఇక, కడప జిల్లాలో టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రెవెన్యూ సదస్సులకు సంబంధించి కేబినెట్లో చర్చ జరిగింది. 22 ఏ ల్యాండ్ సర్వే వివాదాలపై చర్చ జరిగింది.. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు.. రెవెన్యూశాఖ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఆర్ధిక క్రమశిక్షణ సరిగ్గా లేక గత ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో కి నెట్టిందని ఆరోపించారు.. ఇక, నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. వచ్చే విద్యాసంవత్సరం లో డీఎస్సీ నిర్వహణకు సిద్ధం అయ్యింది.. డీఎస్సీ నిర్వహనతో పాటు.. తల్లికి వందనం కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉంటుందని తెలిపారు మంత్రి పార్థసారథి..
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..