AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సూపర్ సిక్స్కు గ్రీన్ సిగ్నల్..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ..
- మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. అందులో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిలో 100 పడకలు చేయడానికి కేబినెట్ నిర్ణయించిందన్నారు.. అమరావతిలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. కొత్త టెండర్లతో పనులు జరుగుతాయని వివరించారు మంత్రి పార్థసారథి.. A M R U D A చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం లో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు . పారిశ్రామిక వేత్తలు తమ పనులు సగంలో ఆపి వెళ్లిపోయారు. రుణాలు ఇచ్చే బ్యాంక్లు కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదన్నారు.. ఇక, కడప జిల్లాలో టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రెవెన్యూ సదస్సులకు సంబంధించి కేబినెట్లో చర్చ జరిగింది. 22 ఏ ల్యాండ్ సర్వే వివాదాలపై చర్చ జరిగింది.. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు.. రెవెన్యూశాఖ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఆర్ధిక క్రమశిక్షణ సరిగ్గా లేక గత ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో కి నెట్టిందని ఆరోపించారు.. ఇక, నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. వచ్చే విద్యాసంవత్సరం లో డీఎస్సీ నిర్వహణకు సిద్ధం అయ్యింది.. డీఎస్సీ నిర్వహనతో పాటు.. తల్లికి వందనం కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉంటుందని తెలిపారు మంత్రి పార్థసారథి..
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..