AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. జిల్లాల పునర్విభజనకు ఆమోదం
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాల.. జిల్లాల పునర్విభజనకు ఆమోదం..
- 3 కొత్త జిల్లాల ఏర్పాటు..
- రాజంపేటను కడపలో కలిపేందుకు గ్రీన్ సిగ్నల్..
- రైల్వేకోడూరును తిరుపతికి మారుస్తూ నిర్ణయం..
- గూడూరును నెల్లూరులో విలీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజా అవసరాలు, పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Indonesia: ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధాశ్రమంలో 16 మంది సజీవదహనం
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
కేబినెట్కీలక నిర్ణయాలు..
* జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపింది కేబినెబ్.. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* రాజంపేట ఇకపై కడప జిల్లాలో ఉండనుంది.. ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
* రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాకు రుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా పరిధిలోకి మార్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
* 3 కొత్త జిల్లాల ఏర్పాటు కానున్నాయి.. కేబినెట్ సమావేశంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది.
* గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ప్రజా పాలనకు మరింత దగ్గర చేస్తుందని అధికారులు తెలిపారు.
* 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం పెంచేందుకు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇక, కేబినెట్ ఆమోదం అనంతరం తుది గెజిట్ నోటిఫికేషన్ను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గెజిట్తో జిల్లాల మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. దీంతో, జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో స్పష్టం చేసినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు స్థానిక అభివృద్ధి, పాలనా సమన్వయానికి కీలకంగా మారనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వేగం పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Spider Man: భారత్లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!