Ambati Rambabu Granted Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే..?
- అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు..
- చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి బెయిల్..
- ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న అంబటి..
- పోలీసుల కస్టడీ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు..
- మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు రిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Granted Bail: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అంబటికి ఈ బెయిల్ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంజూరు చేసింది.. అయితే, ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు అంబటి రాంబాబు.. మరో కేసులో ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ఈ కేసులో బెయిల్ మంజూరు అయినా.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి..
Read Also: Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
మరోవైపు.. పోలీసులు అంబటిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ చేసినా, మొబైల్ కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో అంబటి బెయిల్పై విడుదలయ్యే అవకాశం వచ్చినా.. మరో కేసులో రిమాండ్ ఉండడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. ఇక, గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలపై అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. ఈ కేసు కూడా ప్రస్తుతం ఈ నెల 22 వరకు రిమాండ్ కొనసాగుతోంది. అంటే.. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు.. అంబటి రాంబాబు పై 35 క్వాష్ పిటిషన్ల విచారణను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదయ్యాయి. అయితే, అంబటి రాంబాబు వీటిని క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై విచారణ జరుగుతుండగా, హైకోర్టు పోలీసులకు కీలక సూచనలు చేసింది. విచారణలో BNSS 35(3) ప్రొసీజర్ని పాటించాలని, తుది నిర్ణయం వెలువడే వరకు తొందరపాటు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఒకే విషయంపై 35 FIRలు నమోదు చేయడం ఏంటి? అని ప్రశ్నించింది హైకోర్టు.. అంబటి రాంబాబు తరఫున హాజరైన లాయర్ కోర్టుకు చెప్పిన వివరాల్లో, ఒకే అంశంపై 35 FIRలు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. కానీ, ప్రభుత్వం తరపున వెలువడిన వాదనలో, వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఈ FIRలు అందుకున్నట్టు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది.. ఈ కేసులపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!