Ambati Rambabu Granted Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే..?
- అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు..
- చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి బెయిల్..
- ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న అంబటి..
- పోలీసుల కస్టడీ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు..
- మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు రిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Granted Bail: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అంబటికి ఈ బెయిల్ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంజూరు చేసింది.. అయితే, ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు అంబటి రాంబాబు.. మరో కేసులో ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ఈ కేసులో బెయిల్ మంజూరు అయినా.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి..
Read Also: Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
మరోవైపు.. పోలీసులు అంబటిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ చేసినా, మొబైల్ కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో అంబటి బెయిల్పై విడుదలయ్యే అవకాశం వచ్చినా.. మరో కేసులో రిమాండ్ ఉండడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. ఇక, గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలపై అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. ఈ కేసు కూడా ప్రస్తుతం ఈ నెల 22 వరకు రిమాండ్ కొనసాగుతోంది. అంటే.. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు.. అంబటి రాంబాబు పై 35 క్వాష్ పిటిషన్ల విచారణను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదయ్యాయి. అయితే, అంబటి రాంబాబు వీటిని క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై విచారణ జరుగుతుండగా, హైకోర్టు పోలీసులకు కీలక సూచనలు చేసింది. విచారణలో BNSS 35(3) ప్రొసీజర్ని పాటించాలని, తుది నిర్ణయం వెలువడే వరకు తొందరపాటు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఒకే విషయంపై 35 FIRలు నమోదు చేయడం ఏంటి? అని ప్రశ్నించింది హైకోర్టు.. అంబటి రాంబాబు తరఫున హాజరైన లాయర్ కోర్టుకు చెప్పిన వివరాల్లో, ఒకే అంశంపై 35 FIRలు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. కానీ, ప్రభుత్వం తరపున వెలువడిన వాదనలో, వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఈ FIRలు అందుకున్నట్టు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది.. ఈ కేసులపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!