Ambati Rambabu Granted Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే..?
- అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు..
- చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి బెయిల్..
- ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న అంబటి..
- పోలీసుల కస్టడీ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు..
- మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు రిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Granted Bail: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అంబటికి ఈ బెయిల్ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంజూరు చేసింది.. అయితే, ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు అంబటి రాంబాబు.. మరో కేసులో ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ఈ కేసులో బెయిల్ మంజూరు అయినా.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి..
Read Also: Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. పోలీసులు అంబటిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ చేసినా, మొబైల్ కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో అంబటి బెయిల్పై విడుదలయ్యే అవకాశం వచ్చినా.. మరో కేసులో రిమాండ్ ఉండడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. ఇక, గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలపై అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. ఈ కేసు కూడా ప్రస్తుతం ఈ నెల 22 వరకు రిమాండ్ కొనసాగుతోంది. అంటే.. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు.. అంబటి రాంబాబు పై 35 క్వాష్ పిటిషన్ల విచారణను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదయ్యాయి. అయితే, అంబటి రాంబాబు వీటిని క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై విచారణ జరుగుతుండగా, హైకోర్టు పోలీసులకు కీలక సూచనలు చేసింది. విచారణలో BNSS 35(3) ప్రొసీజర్ని పాటించాలని, తుది నిర్ణయం వెలువడే వరకు తొందరపాటు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఒకే విషయంపై 35 FIRలు నమోదు చేయడం ఏంటి? అని ప్రశ్నించింది హైకోర్టు.. అంబటి రాంబాబు తరఫున హాజరైన లాయర్ కోర్టుకు చెప్పిన వివరాల్లో, ఒకే అంశంపై 35 FIRలు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. కానీ, ప్రభుత్వం తరపున వెలువడిన వాదనలో, వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఈ FIRలు అందుకున్నట్టు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది.. ఈ కేసులపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!