Minister Narayana: 29,233 మంది రైతులకు ప్లాట్ల అలాట్మెంట్ జరిగింది..
- రాజధాని రైతుల సమస్యలపై త్రి మెన్ కమిటీలో చర్చించాం..
- గ్రామ కంఠం.. జరీబు, నాన్ జరీబు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి..
- 29,233 మంది రైతులకు ప్లాట్ల అలాట్మెంట్ జరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన త్రి-మెన్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది అని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ కంఠం, జరీబు, నాన్-జరీబు భూములకు సంబంధించిన సమస్యలే ప్రధానంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 29,233 మంది రైతులకు ప్లాట్ల అలాట్మెంట్ పూర్తయ్యిందని మంత్రి వెల్లడించారు. అయితే రాజధాని భూములకు సంబంధించి 312 కోర్టు కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీధి పోటు సమస్యలు, వారసత్వ వివాదాలు, అలాగే ఎన్ఆర్ఐల కారణంగా కొన్ని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగలేదని చెప్పారు.
Read Also: Dhurandhar: హృతిక్ వ్యాఖ్యలపై దర్శకుడు స్పందన.. ‘ధురంధర్ పార్ట్ 2’పై క్లారిటీ ఇచ్చిన ఆదిత్య ధర్
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
- Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
- Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
భూ సమీకరణ జరగని భూముల్లో కూడా 921 ప్లాట్లు రైతులకు కేటాయించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీఆర్ఎస్ (VRS) విధానం ద్వారా సర్వే నిర్వహించామని, అందులో కొందరు రైతులు వేరే చోట ప్లాట్లు తీసుకోవడానికి సమ్మతించగా, మరికొందరు వేచి చూస్తామని, ఇంకొందరు తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో 7,628 ప్లాట్ల రిజిస్ట్రేషన్ వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అయితే 1,697 ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అలాగే కొందరు రైతులు ఎఫ్ఎస్ఐ (FSI) పెంచాలని డిమాండ్ చేసిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్రి-మెన్ కమిటీ చర్చల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!