Cyclone Montha: వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్లోకి 9 కి.మీ. మేర వరద నీరు.. టన్నెల్లో 250 మంది కార్మికులు..!
- మొంథా తుఫాన్ ప్రభావంపై మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫరెన్స్..
- వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడి నీరు..
- 2 టన్నెల్స్ లోకి 9 కిలో మీటర్ల మేర లోనికి వరద నీరు..
- టన్నెల్ లోని 250 మంది కార్మికులు సురక్షిత ప్రాంతానికి తరలింపు..
Cyclone Montha: మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. భారీ నష్టాన్ని మిగిల్చింది.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. తుఫాన్ అనంతర పరిస్థితులపై ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సీ, సీఈలు, ఎస్ఈ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాం మంత్రి నిమ్మల రామానాయుడు.. ఆత్మకూరు, డోర్నాలా ప్రాంతంలో భారీ వర్షాలతో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడి నీరు చేరినట్టు తెలిపారు.. వెలిగొండ టన్నెల్ ఎగ్జిట్ ప్రాంతానికి నీరు రావడంతో 2 టన్నెల్స్ లోకి 9 కిలో మీటర్ల మేర లోనికి నీరు ప్రవేశించిందని తెలిపారు.. టన్నెల్ లో 250 మంది కార్మికులు పనిచేస్తుండగా.. వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించామని వెల్లడించారు.. ఇక, టన్నెల్ లో డీ వాటరింగ్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు మంత్రి నిమ్మల..
Read Also: Cyclone Montha: మరో 48 గంటలు జాగ్రత్త.. జిల్లా కలెక్టర్లకు మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
ఇక, గుండ్లకమ్మ పరివాహక ప్రాంత అధిక వర్షాలతో ఔట్ఫ్లోను 70 వేల క్యూసెక్కుల నుండి లక్ష క్యూసెక్కులకు విడుదల చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల.. గుండ్లకమ్మ వరద నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల కలెక్టర్లు దిగువ గ్రామాలలో అవసరమైన జాగ్రత చర్యలు తీసుకోవాలని సూచించాం. ఒడిశా రాష్ట్రంలోని వరదలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్రలోని బహుదా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. చెరువులు, కాలువలకు గండ్లు పడిన చోట కలెక్టర్లతో మాట్లాడి టీఆర్-27 కింద అత్యవసర అనుమతులు తీసుకుని వెంటనే మరమత్తులు పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.. రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!
-
Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
-
Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
ట్రెండింగ్
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!