Maoists: మావోయిస్టుల మృతదేహాలకు ముగిసిన పోస్టుమార్టం..
- రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి..
- సురేష్, వాసు, అనితల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగింత..
- మృతదేహాలను ప్రత్యేక వాహనాలలో తమ స్వస్థలాలకు తరలించిన మృతుల బంధువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists: అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ముగిసింది. సురేష్, వాసు, అనితల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. ఈ నెల 18, 19వ తేదీలలో జరిగిన ఎన్ కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్నటి వరకు 10 మృతదేహాలను అప్పగించారు. మిగతా మూడు మృతదేహాలకు కూడా పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. ఈ మృతదేహాలను ప్రత్యేక వాహనాలలో తమ స్వస్థలం అయినా ఛత్తీస్ గఢ్ కి మృతుల బంధువులు తీసుకుని వెళ్లారు. ఇక, ఆ వాహనాలను పోలీసులు ఫాలో అయ్యారు.
Read Also: Delhi: ఢిల్లీని ముంచెత్తుతున్న కాలుష్యం, గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో కఠిన ఆంక్షలు అమలు !
Also Read
అయితే, మావోయిస్టు కార్యకలాపాల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం నాడు రంపచోడవరం సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. మారేడిమిల్లి అటవి ప్రాంతంలో రెండు ఎన్ కౌంర్లు జరిగాయి.. హిడ్మా, టెక్ శంకర్ గ్రూపులకు సంబంధించిన మొత్తం 13 మంది ఎన్ కౌంటర్ అయ్యారు.. మిగిలిన మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నాం.. సంభవ్ ఆపరేషన్ కొనసాగుతుంది.. మావోయిస్టులను నిర్మూలించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!