Atmakur Bypoll: ఆత్మకూరులో రేపు పోలింగ్.. భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1132 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 148 మంది మైక్రో అబ్జర్వర్ల నియామకం చేశారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశారు. నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు భద్రతలో వున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరుకి ఉప ఎన్నిక అనివార్యం అయింది. వైసీపీ, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. టీడీపీ గత సంప్రదాయాలను అనుసరించి పోటీ చేయడం లేదు. 2019లో ఆత్మకూరులో 83.38 శాతం మేర పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి ఎంత పోలింగ్ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో వున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు వుండగా, మొత్తం రెండు లక్షల 13 వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా వుండడం విశేషం, మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది ఉంటే పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు. ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు సాయంత్రానికల్లా చేరుకుని సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత అమలులో వుంది.
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్ను..!
ఎన్నికల నియమావళి పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు ఈసీ అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఓటర్లు అంతా ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రమాలపై సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. అధికారిక వైసీపీ తన అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో వున్నారు. బీజేపీ తరఫున భరత్ కుమార్ పోటీలో వున్నారు. ఈ ఉప ఎన్నికలో లక్షకు పైగా మెజార్టీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుది. ఉప ఎన్నిక బాధ్యతను సైతం మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానికి అప్పచెప్పారు అధినేత జగన్.. మరోవైపు బీజేపీ సైతం ఈ ఎన్నిక ఫలితం పై భారీగానే ఆశలు పెట్టుకుంది. తమకు మంచి ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు సైతం భారీగా ప్రచారం నిర్వహించారు.
Ruchira Kamboj:యూఎన్వో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
తాజావార్తలు
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?