ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడిపై ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తప్పుబడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ప్రజలు జగన్ శాశ్వత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నమ్ముతున్నారు. లోకేష్ బాబు ఆయన బాబు చంద్ర బాబు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు.ఎల్లో మీడియా అమ్మ ఒడి పథకంపై నానా తప్పులు రాస్తుందన్నారు. తల్లిరొమ్ము పాలు తాగిన ఏ వ్యక్తి అమ్మ ఒడిని విమర్శించరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకువచ్చింది. హైదరాబాద్ లో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.
అమ్మ ఒడి పథకాన్ని యావత్ భారత దేశం ప్రశంసిస్తుందన్నారు. కుల మాత బేధం లేకుండా పిల్లలను విద్యావంతులను చేయడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చాం. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని జగనన్న ఈ పథకాన్ని తీసుకువచ్చారన్నారు మంత్రి సురేష్. రెండు సార్లు అమ్మ ఒడి ద్వారా ఆర్థిక సాయాన్ని అందించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా కూడా ఇంత గొప్పపథకాన్ని చేపడుతున్నాం. అమ్మ ఒడికి నూతన నిబంధనలు పెడుతున్నాం అని రాస్తున్నారు. అదంతా తప్పు. ఈ పథకం పై నూతన ఆంక్షలు ఏవీ పెట్టడం లేదు. విషం చిమ్మే మాటలను ఎల్లో మీడియా రాస్తుందన్నారు. శానిటైజ్ వర్కర్లకు ఈ పథకం వర్తింపజేస్తున్నాం. అన్ని వర్గాలకు చెందిన 81% మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేశాం. గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల లిస్ట్ ఉంటుంది, పరిశీలించుకోవచ్చన్నారు.
జగనన్న ఒక్క బటన్ నొక్కితే లబ్దిదారులకు అన్ని పథకాలు చేరుతున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి.అమ్మ ఒడి పథకాలపై విషం చిమ్మే మాటలు రాయడం బాధాకరం. కరోనాతో స్కూల్స్ మూతపడినప్పుడు కూడా 70శాతం అటెండెన్స్ లేకున్నా ఆర్థిక సాయం చేసాం. ఎన్నికలు వస్తున్నాయంటే టీడీపీ కుట్రలు చేస్తుంది. చంద్రబాబు అంటే వంచనకు చిహ్నం. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే.
అసత్యాలను వండి వార్చిన కూడా ప్రజలకు మాపై విశ్వాసం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తాం అన్నారు. అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్స్ కూడా త్వరలో అందిస్తున్నాం. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివే వారికి మరింత సహాయం చేస్తాం. మేము అమ్మ…ఒడిపై ఆంక్షలు పెడుతున్నాం అంటున్న లోకేష్ బాబు, చంద్రబాబు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. కేబినెట్ లో ఉన్న 70శాతం పదవులు బడుగు బలహీన వర్గాల వారికి దక్కాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.