Aarogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. సామాన్య ప్రజల అవస్థలు!!
- ఏపీలో ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగింపు..
- చర్చల తర్వాతే సేవలు తిరిగి ప్రారంభిస్తామంటున్న ఆస్పత్రుల అసోసియేషన్..
- CFMSలో పెండింగ్లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు..
- త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ..
- సీఎం సమక్షంలోనే సమావేశం జరగాలని పట్టుబట్టిన స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aarogyasri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగుతోంది. దీని వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ మాత్రం చర్చలు జరిగే వరకు ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించబోమని తేల్చి చెప్పారు. ఇక, ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. CFMSలో పెండింగ్లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం కష్టమైందని ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది.
Read Also: Keerthy Suresh: ఆ రోల్స్ కోసమే బాలీవుడ్కి వచ్చాను..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అయితే, త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ ఇచ్చారు. కానీ, ఈ హామీపై ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు విశ్వాసం చూపకపోగా, సమస్యపై తుది పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఒక సమావేశం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి సంఘాల నిర్ణయంతో రాష్ట్రంలో పేద ప్రజలు ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్చలు ఎప్పుడు జరుగుతాయో, తిరిగి సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో అని ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
మరోవైపు, తెలంగాణలో కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలకు బ్రేక్ పడింది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల సమ్మె యథాతథంగా కొనసాగుతుంది. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా నెట్ వర్క్ ఆస్పత్రులు పట్టువీడటం లేదు.. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!