Aarogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. సామాన్య ప్రజల అవస్థలు!!
- ఏపీలో ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగింపు..
- చర్చల తర్వాతే సేవలు తిరిగి ప్రారంభిస్తామంటున్న ఆస్పత్రుల అసోసియేషన్..
- CFMSలో పెండింగ్లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు..
- త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ..
- సీఎం సమక్షంలోనే సమావేశం జరగాలని పట్టుబట్టిన స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aarogyasri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగుతోంది. దీని వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ మాత్రం చర్చలు జరిగే వరకు ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించబోమని తేల్చి చెప్పారు. ఇక, ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. CFMSలో పెండింగ్లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం కష్టమైందని ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది.
Read Also: Keerthy Suresh: ఆ రోల్స్ కోసమే బాలీవుడ్కి వచ్చాను..
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
అయితే, త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ ఇచ్చారు. కానీ, ఈ హామీపై ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు విశ్వాసం చూపకపోగా, సమస్యపై తుది పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఒక సమావేశం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి సంఘాల నిర్ణయంతో రాష్ట్రంలో పేద ప్రజలు ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్చలు ఎప్పుడు జరుగుతాయో, తిరిగి సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో అని ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
మరోవైపు, తెలంగాణలో కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలకు బ్రేక్ పడింది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల సమ్మె యథాతథంగా కొనసాగుతుంది. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా నెట్ వర్క్ ఆస్పత్రులు పట్టువీడటం లేదు.. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!