2000 Notes Fraud: 2000 నోట్ల మార్పిడి పేరుతో భారీ మోసం.. రూ.18 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Biharis Cheated Panipuri People In The Name Of Exchange Of 2000 Notes: ఈరోజుల్లో దొంగలు చాలా తెలివి మీరారు. ఇంతకుముందులాగా ముసుగు కప్పుకొని దాడులు చేయకుండా.. ట్రెండ్కి తగిన వ్యూహాలు రచిస్తూ, దోపిడీలకు పాల్పడుతున్నారు. మాయమాటలు చెప్పి, జనాల్ని బురిడీ కొట్టిస్తూ, లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఫలానా పని కచ్ఛితంగా చేస్తామని బలంగా నమ్మించి, జనాలకు శఠగోపాలు పెడుతున్నారు. తాజాగా బీహార్కు చెందిన ముగ్గురు దొంగలు కూడా.. రూ.2000 నోట్ల మార్పిడి పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా రూ.18 లక్షలు తీసుకుని పారిపోయారు. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Pakistan: పాకిస్థాన్లో కుండపోత.. 86 మంది మృతి, 151 మందికి గాయాలు
Also Read
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లను రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఆ నోటుకి మార్కెట్లో ఇప్పుడు పెద్దగా విలువ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈ నోట్లను మార్చుకుంటున్నారు జనాలు. అయితే.. బీహార్కి చెందిన ముగ్గురు వ్యక్తులు మాత్రం, ఒక పెద్ద ప్లాన్ వేశారు. తమకు రూ.6 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.18 లక్షల విలువగల రూ. 2000 నోట్లను ఇస్తామని నమ్మబలికారు. అంటే.. ఒకటికి మూడింతల లాభం ఇస్తామని పానీపూరి నిర్వాహకుల్ని నమ్మించారు. దీంతో.. వాళ్లు టెంప్ట్ అయ్యారు. రెండు వేల నోట్ల మార్పిడికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఆఫర్తో తాము లక్షాధికారులం అవుతామని భావించి, ఈ డీల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Article 370: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు
డీల్ ప్రకారం.. పానీపూరి నిర్వాహకులు ఆ కేటుగాళ్లకు రూ.6 లక్షల విలువగల రూ.500 నోట్లను ఇచ్చారు. వాళ్లు ఒక బ్యాగ్ ఇచ్చి, అక్కడి నుంచి వెంటనే ఉడాయించారు. బాధితులు ఆ కేటుగాళ్లు ఇచ్చిన బ్యాగ్ ఓపెన్ చేయగా.. అందులో చిత్తు కాగితాలు ఉండటాన్ని గమనించారు. పైన నిజంగానే నోట్లు ఉన్నట్లు ఫేక్ నోట్లు పెట్టి, లోపల చిత్తుకాగితాలు కుక్కారు. దీంతో.. తాము మోసపోయామని భావించిన బాధితులు, వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
-
Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
-
Credit Card Tips: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 ఛార్జీలపై ఒక లుక్కేయండి.. లేదంటే అప్పుల పాలవుతారు!
-
Riyan Parag: ప్లే ఆఫ్స్ చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రియాన్ పరాగ్.. ‘అతడు లేకపోతే ఇంటికి వెళ్లేవాళ్లం’..
-
RR VS MI: ప్లే ఆఫ్స్లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!