Site icon NTV Telugu

మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీని ప్రారంభించిన సీఎం జగన్

మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ 2021-22ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఉన్న 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచటమే ఉద్దేశ్యంగా ఈ పాలసీని ప్రారంభించారు. రాష్ట్రంలో 50 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పాలసీ రూపుదిద్దుకుంటోంది. ముందుకు వచ్చే ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పెట్టుబడిలో 30 శాతం వరకు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అలాగే విద్యుత్ యూనిట్ కు రెండు రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి అమలులో ఉన్నట్లు పరిగణలోకి తీసుకోనుంది. ఇక ఈ ఆక్సిజన్ పాలసీ ఏడాది వరకు అమలలో ఉండనుంది.

Exit mobile version