IPL 2022: రోహిత్ పని అయిపోయినట్లేనా..? ముంబై పరాజయాలకు కారణమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ మాదిరిగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. ఈ సీజన్లో ముంబై టీమ్ వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో రోహిత్ కెప్టెన్సీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఐపీఎల్ విజయాల కారణంగానే అతడికి టీమిండియా కెప్టెన్సీ అవకాశం వచ్చిందనేది అక్షర సత్యం. మరి ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో రానున్న టీ20 ప్రపంచకప్లో రోహిత్ టీమిండియాను ఎలా నడిపిస్తాడనే విషయంపైనే తెగ చర్చ జరుగుతోంది.
అయితే ప్రస్తుత ఓటములకు వేలంలో ముంబై జట్టు చేసిన తప్పిదమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముంబై పరాజయాలకు కారణం ఆ జట్టు బౌలింగేనని.. గతంలో బుమ్రాకు తోడుగా బౌల్ట్ ఉండేవాడు అని.. వారిద్దరికీ అండగా ఆల్రౌండర్ హార్డిక్ పాండ్యా బౌలింగ్లో సహాయం అందించేవాడని వివరిస్తున్నారు. అయితే ఇటీవల వేలంలో ముంబై జట్టు బౌల్ట్ను మళ్లీ తీసుకోలేదు. దీంతో బుమ్రాపై ఒత్తిడి ఎక్కువ అయిపోతోంది. ఈ కారణంగా అతడి బంతులు గతి తప్పుతున్నాయి.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
మరోవైపు ముంబై జట్టుగా విఫలం అవుతున్నా రోహిత్ బ్యాటింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. రోహిత్ పేలవ ఫామ్ ముంబై జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. ముంబై ఓటముల నేపథ్యంలో త్వరలోనే టీమిండియా కెప్టెన్గా రోహిత్ను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రోహిత్ను కెప్టెన్గా తప్పిస్తే అతడి స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టే అర్హత హార్డిక్ పాండ్యాకు మాత్రమే ఉందని బెంగాల్ క్రీడా మంత్రి, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ లేదా భవిష్యత్ టీమిండియా కెప్టెన్గా ఫోకస్ అవుతున్న రిషబ్ పంత్కు సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదన్నాడు. ప్రస్తుత ఐపీఎల్లో కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగానూ అద్భుతంగా రాణిస్తున్న హార్డిక్ పాండ్యాకే మెరుగైన అవకాశాలు ఉన్నాయని మనోజ్ తివారీ చెప్పాడు. కాగా ఈ సీజన్లో హార్డిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
కాగా ముంబై పరాజయాలకు బాధ్యత తనదే అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. తప్పేంటో తెలిస్తే సరిచేసేవాడినే.. కానీ అది బయటపడటం లేదు.. ప్రతి గేమ్ ఆడటానికి తనను తాను ప్రిపేర్ చేసుకుంటున్నా. అందులో తేడా లేదు. కాకపోతే సమస్య బయటకు రావడం లేదని రోహిత్ తెలిపాడు. టీం తన నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఆ స్థితిలో ఉంచలేకపోయినందుకు పూర్తి బాధ్యత తనదే అన్నాడు. ఇన్నేళ్లుగా ఆడుతున్నట్లుగానే మళ్లీ తనకు తానే సపోర్ట్ చేసుకుని ఆడుతున్నానని.. ముందుకు వెళ్లడమనేది చాలా ముఖ్యమన్నాడు. ఇక్కడితో ప్రపంచం ముగిసిపోలేదని.. మళ్లీ పుంజుకుని తిరిగొస్తామని రోహిత్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. డ్రెస్సింగ్ రూమ్లోకి నో ఎంట్రీ..
-
Sunitha : ఎన్టీఆర్ పాటల్లో లేవా బూతులు? ఇప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు!
-
KTR : రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం
-
Pakistan-Israel: అసిమ్ మునీర్ హత్యా ఆరోపణలపై స్పందించిన పాకిస్థాన్
-
Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!