Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Analysis Those Two Leaders Clearing The Line For Jagan

జగన్ కు లైన్ క్లియర్ చేస్తున్న ఆ ఇద్దరు నేతలు?

Published Date :October 14, 2021 , 1:22 pm
By Lakshmi Narayana
జగన్ కు లైన్ క్లియర్ చేస్తున్న ఆ ఇద్దరు నేతలు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. అయినా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని కొట్టారు. ఈ వ్యూహం నాడు సత్ఫలితాలు ఇవ్వడంతో ఏపీలోనూ ఇదే ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు ముందుగానే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకెళుతున్నారు. దీంతో ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనపై పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు రోజురోజుకు బలహీనపడుతున్నాయి. ఈక్రమంలోనే మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించినట్లుగా ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. వైసీపీ ట్రాప్ లో టీడీపీ, జనసేన పార్టీలు చిక్కుకోవడంతో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా తిరుగులేదనే వాదనలు విన్పిస్తున్నాయి.

ఏపీలో ఎవరు అవునన్న.. కాదన్న కులాల ప్రతిపాదనకే ఓట్లు పడుతాయి. రాజకీయ నాయకులకు ఈ విషయం తెలుసు గనుకే ప్రజలను కులాల వారీగా విభజించే ప్రయత్నం చేస్తుంటారు. గత ఎన్నికల్లోనూ కులాల ప్రభావం గెలుపొటములపై భారీగానే చూపించింది. టీడీపీకి తొలి నుంచి సపోర్టు చేసే ఓ సామాజిక వర్గం గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచింది. దీంతో ఆపార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రాగా టీడీపీ బొక్కబొర్లా పడింది. అయితే ఈ సామాజిక వర్గం రాబోయే ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపుతుందో తెలియడం లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఫాలో అయినా ఫార్మూలానే మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని జగన్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో కమ్మ, నాన్ కమ్మగా ప్రజలు విడిపోయి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఈ ఎత్తుగడ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇక జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మరోలా కలిసి వచ్చే అవకాశం ఉండనుంది. కమ్మ, కాపులు ఏకమై తనను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మిగిలిన కులాలను ఓన్ చేసుకునే అవకాశం ఉండనుంది. ఈ క్రమంలోనే ఏపీలో గత కొద్దిరోజులుగా కులాల ప్రస్తావన తరుచూ తెరపైకి వస్తోంది.

కులాలకు అతీతమని చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇటీవల ఇదే అంశంపై తరుచూ మాట్లాడుతున్నారు. కాపులను ఓన్ చేసుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వైసీపీ మంత్రులు సైతం పవన్ కల్యాణ్ పై కాపు ముద్ర వేయడంతో సక్సస్ అవుతున్నారు. టీడీపీ, జనసేన మరోసారి కలిస్తే పొటీ చేస్తే కమ్మ, కాపులకు ధీటుగా రెడ్డి, నాన్ రెడ్డీస్ అంశంపై తెరపైకి వచ్చే అవకాశం కన్పిస్తుంది. ఈ పరిణమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో విజయవంతమైన ఫార్మూలానే సీఎం జగన్ కొన్ని మార్పులుచేసి తిరిగి ప్రయోగిస్తుండటంతో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm jagan
  • ycp

తాజావార్తలు

  • Ghattamaneni Family : ఘట్టమనేని మూడో తరంలో స్టార్‌ అయ్యేదెవరు?

  • Vidadala Rajini: మహిళా బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు.. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం

  • Hardik Pandya vs Bumrah: హార్దిక్-బుమ్రా మధ్య వాగ్వాదం.. ముంబై ఇండియన్స్‌లో అంతా బాగానే ఉందా?

  • Virat Kohli: “అలా ఐతే క్రికెట్‌కు గుడ్ బై చెబుతా”.. విరాట్ కోహ్లీ సంచలన స్టేట్‌మెంట్.. ట్విస్ట్ ఏంటంటే..?

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

ట్రెండింగ్‌

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions