ఏపీలో వన్ మ్యాన్ షో చేస్తున్న జనసేనాని?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో పవన్ ప్రచారం చేయగా.. చిరంజీవి ఏపీలో ప్రచారం చేశారు. అయితే అనుకున్న రీతిలో ఆపార్టీకి నాడు ఫలితాలు రాలేదు. ఆ తర్వాత వైఎస్ మరణంతో కాంగ్రెస్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర విభజన తదితర అంశాలన్నీ కూడా ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడానికి కారణమయ్యాయి. చిరంజీవి కేంద్రమంత్రి కాగా పవన్ కల్యాణ్ సినిమాలకే పరిమితమయ్యారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోవడంతో చిరంజీవి రాజకీయంగా సైలంటైపోయారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం 2014 ఎన్నికల ముందు సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో కిందటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వామపక్ష పార్టీలతో కలిసి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
అయితే ఈ ఎన్నికలకు జనసేన అధినేతను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. జనసేనకు కేవలం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే వచ్చింది. పవన్ స్వయంగా రెండుచోట్ల ఓడిపోయారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన జనసేనను లైట్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం అటూ సినిమాలు చేస్తూనే రాజకీయంగానూ యాక్టివ్ గా ఉంటున్నారు. టీడీపీ పోషించాల్సిన ప్రతిపక్ష పాత్రను జనసేన పోషించే స్థాయికి తీసుకెళ్లారు.
ప్రజా సమస్యలపై గళం విప్పుతూ వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జనసేన చేపట్టిన రోడ్ల సమస్య రాజకీయంగా హీట్ ను పెంచుతోంది. వైసీపీ, జనసైనికుల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ నేడు రాజమండ్రిలో శ్రమదాన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఆయన శ్రమదాన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో వైసీపీ సర్కారు కావాలనే జనసేన కార్యక్రమాలు అనుమతి ఇవ్వడం లేదని ఆపార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ను చూసి వైసీపీ సర్కారు భయపడుతోందని.. అందుకే రోడ్ల శ్రమదానానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ శ్రమదానం వేదికను మార్చుకున్నారు. అయితే అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకున్నా జనసేనాని ముందుగా ప్రకటించిన కార్యక్రమం కొనసాగుతుందని ఆపార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో రాజమండ్రిలో పొలిటికల్ హీట్ మొదలైంది.
మరోవైపు వైసీపీనే అనవసరంగా జనసేనానికి హైప్ క్రియేట్ చేస్తుందనే టాక్ విన్పిస్తోంది. పవన్ కల్యాణ్ రాజమండ్రికి వచ్చినా ఓ రెండు, మూడు గంటలు మాత్రమే ఉండి వెళుతారని అంటున్నారు. పవన్ ఫుల్ టైం పొలిషియన్ కాదని ప్రజలందరికీ తెలుసుని అలాంటప్పుడు ప్రభుత్వం ఇందుకు ఇంత రాద్దాంతం చేసుందని విమర్శిస్తున్నారు. వైసీపీనే పవన్ ఇమేజ్ ను రాజకీయంగా మరింత పెంచుతూ పొలిటికల్ హీరోగా మారుస్తుందనే చర్చ నడుస్తోంది. ఏదిఏమైనా కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ఏపీలో వన్ మ్యాన్ షో చేస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!