నిందితుడు రాజు కోసం పోలీసుల గాలింపు.. కీలక ఆధారం లభ్యం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని నిందితుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా డీజీపీ నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే గత ఆరురోజులుగా పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నా రాజు ఆచూకీ లభించకపోవడం గమనార్హం. నిందుతుడు నిర్మానుష్య ప్రదేశంలో దాక్కొని ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈక్రమంలోనే రాజుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే అతడు ఏం పని చేస్తాడు? అతడి భార్య, పిల్లలు వగైరా వివరాలన్ని సేకరించారు. ఈక్రమంలోనే గతంలోనే రాజుపై ఓ కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు విషయంలో చైతన్యపురి పోలీసులు రాజును పిలిచి విచారించారు. అప్పుడు పోలీసులు తీసిన ఫోటో ఇప్పుడు కేసులో నిందితుడిని గుర్తించేందుకు కీలకంగా మారింది.
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
నిందుతుడి రాజు గంజాయితోపాటు కల్లు, మద్యానికి బానిస అని పోలీసుల విచారణలో తేలింది. అతడు డబ్బు కోసం అడ్డా కూలీ పనులు చేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజు తన మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పోలీసులు కల్లు.. మద్యం దుకాణాలు.. లేబర్ అడ్డాల్లో గాలిస్తున్నారు. ఆరురోజులుగా నిందితుడి ఆచూకీ లభించకపోవడంతో అతడు నిర్మానుష్య ప్రదేశంలో తలదాచుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకండ్లతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు గాలించారు. రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైవేలపై గాలింపులు చేస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి లింక్ ఉన్న హైవేలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈమేరకు నిందితుడు రాజు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించిన ఆనవాళ్లు పోలీసులకు లభించాయి.
నిందితుడి దగ్గర సెల్ ఫోన్ లేకపోవడంతో అతడిని పట్టుకోవడం పోలీసులకు కొంచెం కష్టంగా మారింది. అయితే ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని ఎలాగైనా పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను కూడా అలెర్ట్ చేశారు. అన్ని బస్టాండ్లు, బస్సుల్లో నిందితుడికి సంబంధించిన పోస్టర్లు అంటించారు. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. నిందితుడి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆచూకీ తెలిపినవారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది.
తాజావార్తలు
-
India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
-
Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!