Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Analysis Cm Ys Jagan New Startegy On Bjp

మోదీకి వైఎస్ జగన్ ఝలక్ ఇవ్వబోతున్నారా?

Published Date :September 26, 2021 , 1:17 pm
By Lakshmi Narayana
మోదీకి వైఎస్ జగన్ ఝలక్ ఇవ్వబోతున్నారా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీ వేవ్ వీస్తే.. ఏపీలో వైఎస్ జగన్ వేవ్ వీచింది. అత్యధిక పార్లమెంట్ స్థానాలతో బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింగిల్ గానే ఆపార్టీ మెజార్టీ మార్క్ దాటడంతో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మోదీ-షా ద్వయమే కేంద్రంలో హవా కొనసాగిస్తోంది. ఇక ఏపీలో వైసీపీ సరికొత్త రికార్డు సృష్టిస్తూ అధికారంలోకి వచ్చింది. 175 అసెంబ్లీ సీట్లకుగాను ఆపార్టీ ఏకంగా 151సీట్లను తన ఖాతాలో వేసుకొంది. దీంతో ఏపీలో వైసీపీకి తిరుగులేకుండా పోతోంది.

కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే బీజేపీపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు కరోనా కష్టకాలంలో కేంద్రం అవలంభించిన వైఖరి ఆ పార్టీకి మైనస్ గా మారింది. ప్రత్యేక ప్యాకేజీ పేరిట ప్రకటించిన వేలకోట్ల రూపాయాలు నీటి మీద రాతలుగా మారాయి. సంస్కరణ పేరిట రైతు వ్యతిరేక చట్టాలు చేయడంతో ఆయా వర్గాల ప్రజలు కేంద్రంపై భగ్గమంటున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు గతంలో కంటే బీజేపీ హయాంలోనే ఎక్కువయ్యాయి.

Also Read

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
  • Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
  • love Or Attraction: లవ్‌లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
  • Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
Add as a preferred
source on google

ఇవన్నీ కూడా సామాన్యులపై అధిక భారం మోపుతున్నాయి. దీంతో బీజేపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశపడుతోంది. కానీ ఆ పార్టీతో అంటకాగుతున్న మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ వస్తున్నాయి. ఒకటి రెండు పార్టీలు మినహా బీజేపీ కేంద్రంలో మద్దతు ఇచ్చే పార్టీలే కరువయ్యాయి. బీజేపీకి తొలి నుంచి అండగా నిలుస్తున్న పార్టీలో వైసీపీ ముందంజలో నిలుస్తుంది.

కేంద్రంలోని బీజేపీతో జగన్ సర్కార్ సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వస్తోంది. గడిచిన రెండున్నరేళ్లుగా మోదీ సర్కార్ ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టిన పార్లమెంటులో వైసీపీ మద్దతు తెలుపుతూ వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీకి అండగా నిలిచింది. బీజేపీకి నమ్మకమైన మిత్రుడిగా జగన్ మిగిలారు. అయితే కేంద్రం నుంచి ఏపీకి ఆమేర మద్దతు లభించడం లేదని సీఎం జగన్ భావిస్తున్నారు. ఏపీకి రావాల్సిన స్పెషల్ స్టేటస్ ను అటకెక్కించడమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు కేంద్రం యత్నిస్తుండటం జగన్ సర్కారుకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

కేంద్రంతో వైసీపీ సఖ్యతగా ఉన్నా వారి నుంచి అదే స్థాయిలో మద్దతు లభించడం లేదు. దీనికితోడు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ పడిపోతుంది. ఈక్రమంలోనే బీజేపీని దూరం పెట్టేందుకు సీఎం జగన్ యత్నిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉంటుండటం కూడా ఆయనకు నచ్చడం లేదట. దీంతో ఇక నుంచి కేంద్రంలోని బీజేపీ అన్ని విషయాల్లో గుడ్డిగా మద్దతు ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భారత్ బంద్ విషయంలో మోదీ సర్కారు వ్యతిరేకంగా వైసీపీ మద్దతు ఇవ్వడం కూడా దీనిలో భాగమేనని తెలుస్తోంది.

వచ్చేసారి కూడా ఎలాగైనా గెలవాలని చూస్తున్న సీఎం జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ నడుస్తోంది.. అయితే బీజేపీ పెద్దలు మాత్రం జగన్ కు వదులుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను ఛాలెంజ్ తీసుకున్న బీజేపీ ఏపీకి కొన్ని తాయిళాలను ప్రకటించిన జగన్ ను తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏదిఏమైనా ఈ రెండు పార్టీల మధ్య గతంలో కంటే గ్యాప్ పెరిగినట్లే కన్పిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలోనే సీఎం జగన్ మోదీకి ఝలక్ ఇవ్వబోతున్నారనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • CM YS Jagan
  • PM Modi
  • ycp

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions