Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Analysis Centrol Government Stubborn On Ap Over Metro Train Sanction

ఏపీకి కేంద్రం మొండిచేయి.. ‘మెట్రో’ ఇంకెప్పుడు?

Published Date :September 19, 2021 , 11:51 am
By Lakshmi Narayana
ఏపీకి కేంద్రం మొండిచేయి.. ‘మెట్రో’ ఇంకెప్పుడు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నవ్యాంధ్ర ఏర్పడి దాదాపు ఏడేళ్లన్నరేళ్లు కావస్తోంది. విభజన హామీలో భాగంగా విశాఖకు రైల్వే జోన్ తోపాటు మైట్రో ట్రైన్ ప్రాజెక్టు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏపీకి మెట్రో ట్రైన్ ప్రాజెక్టు మంజూరు కాకపోవడం శోచనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కు మాత్రమే మెట్రో రైలు ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టీఆర్ఎస్ సర్కారు హయాంలో మెట్రో ట్రైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్లో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. ఈ సదుపాయం వల్ల నగరవాసులకు రవాణా విషయంలో చాలా ఊరట కలిగిందని చెప్పొచ్చు.

నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కనీసం రాజధాని సైతం నిర్మించలేక పోయారు. ఇక ప్రతిష్టాత్మకమైన మైట్రో ట్రైన్ ప్రాజెక్టును ఏకంగా గాలికొదిలేశారు. దీంతో ఏపీకి మైట్రో ట్రైన్స్ సదుపాయం లేకుండా పోయింది. రోజురోజుకు పెరిగిపోతున్న నగర జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ కష్టాలను దూరం చేసేందుకు కేంద్రం మైట్రో రైళ్ల ప్రాజెక్టులను అన్ని రాష్ట్రాలకు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీకి మాత్రం మెట్రో ప్రాజెక్టు విషయంలో బీజేపీ సర్కారు మొండిచేయి చూపిస్తుంది.

దేశంలోని ఈశాన్య, కేంద్ర ప్రాంతాలు మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లో మైట్రో రైళ్ల వ్యవస్థ అందుబాటులో ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి మైట్రో రైల్ వ్యవస్థ గుండెకాయగా మారింది. అక్కడ మరింత రైళ్ల నెట్ వర్క్ ను ప్రభుత్వం విస్తరిస్తోంది. తాజాగా నజఫ్ గడ్ నుంచి దౌసా బస్టాండ్ వరకు నిర్మించిన మెట్రో రైల్వే అందుబాటులోకి వచ్చింది. దీనిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజాగా ప్రారంభించారు. కాగా కేంద్రం 2022 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 900 కిలోమటర్ల మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టును వేర్వేరు రాష్ట్రాలకు మంజూరు చేసింది.

వీటిలో 740 కిలోమీటర్ల మేరకు మైట్రో రైలు ప్రాజెక్టు పనులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది మంజూరు కాబోయే 900 కిలోమీటర్లను మైట్రో రైల్వే విస్తరణను పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా 2వేల కిలోమీటర్ల మైట్రో రహదారి అందుబాటులో రానుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతీయేటా కేంద్రం కొత్త మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. అయితే ఏపీకి మాత్రం ఇప్పటి కూడా ఒక్క మెట్రో ప్రాజెక్టు కూడా మంజూరు చేయకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో మెట్రో ట్రైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురంలో మెట్రో ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. కానీ దక్షిణాదిలో మెట్రో ట్రైన్ లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంది. నవ్యాంధ్రకు మెట్రో ట్రైన్ ప్రాజెక్టు సాధించడంలో గత టీడీపీ సర్కారు ఘోరంగా విఫలమైంది.

ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోనైనా ఏపీకి మెట్రో ప్రాజెక్టును తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించాలని అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • centrol government
  • Metro Train

తాజావార్తలు

  • Pawan Kalyan: సినిమా టికెట్ రేట్ల పెంపుపై పవన్ సంచలన వ్యాఖ్యలు

  • Governor Shiv Pratap Shukla: రైతు భరోసా నుంచి మహాలక్ష్మి వరకు.. సంక్షేమ పథకాలపై గవర్నర్ మార్క్ ప్రసంగం..!

  • Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం: సీఎం చంద్రబాబు

  • Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్

  • Moinabad: ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions