World’s Worst Train Accident: ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే.. ఏకంగా 17 వందల మంది మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలు ప్రమాదం ఈ పేరు వింటేనే కొందరికి భయమేస్తోంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని సాంకేతిక లోపాలు, తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఏదో తెలుసా? దాదాపు 1700 మందిని బలిగొన్న ఈ ప్రమాదం శ్రీలంకలో చోటు చేసుకుంది. 2004లో జరిగిన ఈ దుర్ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
READ MORE: National Film Awards 2025: హను-మాన్ సినిమాకు రెండు, బలగంకు ఓ అవార్డ్.. తెలుగు ఫుల్ లిస్ట్ ఇదే!
Also Read
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
- Shloka Mehta: ఇంటర్నెట్ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్సిటీ.. వీడియో వైరల్
ఈ రైలు ప్రమాదం 26 డిసెంబర్ 2004న శ్రీలంకలో సముద్రాదేవి అనే రైలు కొలంబో నగరం నుంచి గాలే నగరానికి వెళుతోంది. రైలు ఉదయం 6.30 గంటలకు కొలంబోలో స్టార్ట్ అయ్యింది. సముద్రానికి 200 మీటర్ల దూరంలోని శ్రీలంక నైరుతి తీరానికి సమీపంలో ఉన్న తెల్వాట్ట గుండా ప్రయాణించింది. తెల్వత్తా సమీపంలోని పెరలియా గ్రామానికి డిసెంబర్ 26 ఉదయం 9.30 గంటలకు ఈ రైలు చేరుకుంది. ఆ సమయంలో హిందూ మహాసముద్రలో భారీ భూకంపం సంభవించింది. తెల్వట్ట సమీపంలోని పెరాలియా వద్ద ఉన్న నైరుతి తీర రైల్వే లైన్లో ఈ రైలు నిలిచింది. సునామీ కారణంగా మొదట రైలులోకి భారీగా నీరు చేరింది. దీంతో ప్రయాణికులు కంగారు పడుతూ.. రైలు పైకి ఎక్కారు. ఈ సారి బలంగా వచ్చిన అలల ధాటికి రైలు సముద్రంలోకి కొట్టుకుపోయింది. 900 మృత దేహాలను వెలికితీయగా.. 150 మందిని రక్షించారు. రైలులోని ఎనిమిది బోగీల్లో ఉన్న ప్రయాణికులందరూ చనిపోయారు. ఈ ప్రమాదంలో 1700 మంది మరణించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటీ… 2వేలకు పైగా మృత్యువాత పడ్డారని మీడియా సంస్థలు అభిప్రాయపడ్డాయి.
READ MORE: Bride: నిత్య పెళ్లికూతురు.. 8 మందితో వివాహం, 9వ పెళ్లిలో పట్టుబడిన మహిళ..
ఇదిలా ఉండగా.. మన దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదం జూన్ 6, 1981న బీహార్లో జరిగింది. తుపాను సమయంలో రైలు బాగ్మతి నది బ్రిడ్జ్ దాగుతుండగా బోగీలు నదిలో పడిపోయాయి. రెండు రోజుల తర్వాత.. 200 దాకా మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల తర్వాత 235 మంది మరణించారని, ముగ్గురి జాడ తెలియరాలేదని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. కానీ, వందల మంది తమ వాళ్ల జాడ లేదంటూ మీడియా ముందుకు వచ్చారు. నది ఉధృతికి వాళ్లంతా కొట్టుకుపోయి ఉండొచ్చనే భావించారంతా. ఈ ఘటనలో సుమారు ఏడు నుంచి 800 మంది మరణించి ఉండొచ్చని అంచనా వేశారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
-
CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
-
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
-
PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
-
Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!