Phd student: వైరల్గా మారిన పీహెచ్డీ విద్యార్థి చేసిన పని.. ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. వాటిలో క్వాలిటీ కెమెరాలు.. అంతేకాదు.. సోషల్ మీడియా యాప్లు.. దీంతో.. వారికి ఏదైనా కాస్త ప్రత్యేకంగా కనిపిస్తే చాలు.. అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కిస్తున్నారు.. అది కాస్తా రచ్చగా మారుతుంది.. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్న ఓ విద్యార్థి… తన క్యాబిన్ దగ్గర పెట్టిన చిన్న నోట్.. ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. కొందరు.. ఆ విద్యార్థి చేసిన పనికి ఫిదా అవుతూ.. ఎంత నిబద్ధత అని కితాబిస్తుంటే.. చాలు ఓవర్ యాక్షన్ అనేవాళ్లు కూడా లేకపోలేదు.. ఇంతకీ.. ఆ పీహెచ్డీ విద్యార్థి చేసిన పని ఏంటి? అనుమానం వెంటనే రావొచ్చు..
Read Also: Nepal: నేపాల్ లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు..16 మంది దుర్మరణం
Also Read
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాను ‘పీహెచ్డీకి సంబంధించిన పని చేస్తున్నాను అందువల్ల నాతో ఎవరూ మాట్లాడొద్దు.. మరీ అవసరమనుకుంటే మెయిల్ చెయ్యండి’ అంటూ ఉన్న ఓ పేపర్ను తన క్యాబిన్ ఎదుట అతికాండు ఓ విద్యార్థి.. దానికి సంబంధించిన ఫొటోను స్టీవ్ బింగ్హామ్ అనే అధ్యాపకుడు ట్విట్టర్లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్గా మారిపోయింది.. సాధారణంగా సమయానికి చేయాల్సిన పనులు చేయకుండా వాయిదా వేస్తూ ఉంటారు.. అది విద్యార్థుల్లో మరి ఎక్కువగానే ఉంటుంది.. ఇది.. కొన్నిసార్లు పర్వాలేదేమో.. కానీ, సెమిస్టర్లు, ఇతర పరీక్షల సమయంలోనూ లైట్గా తీసుకునేవాళ్లు ఉన్నారు.. ఎవరో వచ్చి వారి పనికి విఘాతం కల్పించడం కాదు.. తమకు తాముగానే చాలా సార్లు వాయిదా వేసుకుంటారు.. దీనితో ఎంతో ప్రమాదం ఉంది.. అదే అలవాటుగా మారితే.. మొత్తం కెరీర్పైనే దాని ప్రభావం ఉంటుంది.. ముఖ్యంగా రీసెర్చ్ చేస్తున్న వారికి టైమ్ మేనేజ్మెంట్ చాలా అవసరం. మధ్యలో ఎవరైనా వచ్చినా.. ఫోన్ కాల్స్తో విసిగించినా.. వారి ఏకాగ్రత దెబ్బతింటుంది.. వారు ఆశించిన ఫలితాలు రాకుండా పోతాయి..
అయితే, ఇలాంటి సమస్యకు చెక్ పెట్టాలని భావించిన పీహెచ్డీ విద్యార్థి వినూత్నంగా ఆలోచించాడు.. నొప్పించక.. తానొవ్వక అన్నట్టుగా.. తన ఆలోచను ఓ పేపర్పై పెట్టారు.. ‘దయచేసి నాతో మాట్లాడొద్దు.. నేను పీహెచ్డీకి సంబంధించిన పని చేస్తున్నా.. ఒక వేళ నేను మాట్లాడటం మొదలుపెడితే మళ్లీ ఆపలేను.. నేను భయంకరమైన వాయిదాలకోరును.. అవకాశం దొరికితే చాలు పనులు వాయిదా వేస్తుంటాను.. మరీ అవసరమనుకుంటే ఈ మెయిల్ చెయ్యండి’ అంటూ రాసిన పేపర్ను తన క్యాబిన్ ముందు అతికించాడు.. మొత్తంగా.. తన వికినెస్ను చెబుతూనే.. తను చేస్తున్న ముఖ్యమైన పనికూడా పేర్కొన్నాడు.. మొత్తంగా.. ఇది సోషల్ మీడియాకు ఎక్కవడంతో.. ఏదైనా కాస్త వెరైటీగా ఉంటే వెంటనే స్పందించే నెటిజన్లు.. ఆ ట్వీట్ను వైరల్ చేస్తున్నారు. నిజామానికి పీహెచ్డీ చేసినవాళ్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు..
https://twitter.com/Steve_Bingham92/status/1577221188404670465
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!