Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today 18 01 23 Business Headlines Local State National To Global Level News

Today (18-01-23) Business Headlines: ‘దావోస్’.. బోరింగ్‌. అందుకే వెళ్లలే: మస్క్. మరిన్ని వార్తలు

Published Date :January 18, 2023 , 4:30 pm
By Akkirala Kondala Rao
Today (18-01-23) Business Headlines: ‘దావోస్’.. బోరింగ్‌. అందుకే వెళ్లలే: మస్క్. మరిన్ని వార్తలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today (18-01-23) Business Headlines:

హైదరాబాదులో పెప్సికో విస్తరణ

అమెరికన్ మల్టీ నేషనల్ ఫుడ్ కంపెనీ పెప్సికో హైదరాబాదులో కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడాదిన్నర లోపు 12 వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. 2019లో 250 మందితో ప్రారంభమైన పెప్సికో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఇప్పుడు 2 వేల 800 మందితో నడుస్తోంది. విస్తరణతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 వేలకు చేరనుంది. ‘దావోస్’లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా పెప్సికో ఈ ప్రకటన చేసింది.

రేపు కేంద్ర ఆర్థిక మంత్రి కీలక భేటీ

ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు మరియు సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు సమావేశం కానున్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సామాజిక, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించనున్నారు. జన్ ధన్ యోజన, ముద్ర, కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం స్వనిధి తదితర పథకాలపై రివ్యూ చేస్తారు. మరింత మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకురావటానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అందుకే ‘దావోస్’కి వెళ్లలేదు: మస్క్

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పరమ బోరింగ్ వ్యవహారమని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. అందుకే తాను ‘దావోస్’లో జరుగుతున్న సమావేశాలకు హాజరుకాలేదని చెప్పారు. అయితే.. ఎలాన్ మస్క్ చేసిన ఈ చులకన వ్యాఖ్యలపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం స్పందించింది. అసలు తాము అతణ్ని ఈ సమావేశాలకి ఆహ్వానించ లేదని పేర్కొంది. ఇప్పుడే కాదు.. 2015వ సంవత్సరం నుంచి ఎలాన్ మస్కుని ఈ సమావేశాలకు పిలవట్లేదని స్పష్టం చేసింది. తనను ఆహ్వానించారని, తానే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని ఎలాన్ మస్క్ గత నెలలో పేర్కొనటాన్ని కూడా ప్రపంచ ఆర్థిక వేదిక ఖండించింది.

భారత వజ్ర వ్యాపారుల సమస్యలు

భారతీయ వజ్ర వ్యాపారులు ఈమధ్య కాలంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరెన్సీ రిస్కులు కూడా ఇందులో ఒక భాగమని జెమ్ అండ్ జ్యూలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ పేర్కొంది. రూపాయల్లో చేసే చెల్లింపులను రష్యన్లు సౌకర్యవంతంగా భావించట్లేదు. రూపాయల్లో వాణిజ్యం చెల్లింపులు చేసేందుకు జులై నెలలో అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక సదుపాయాన్ని ఇప్పటివరకు ఒక్కరు కూడా వాడుకోలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల తర్వాత రష్యా నుంచి జరగాల్సిన సరఫరా 40 శాతం పడిపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

50 ఏళ్ల కనిష్టానికి చైనా గ్రోత్ రేట్

చైనా గ్రోత్ రేట్ 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఆ దేశ జీడీపీ 18 లక్షల కోట్ల డాలర్ల నుంచి 17 పాయింట్ తొమ్మిది, నాలుగు లక్షల కోట్ల డాలర్లకు డౌన్ అయింది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ వివరాలను చైనా జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది. 1974 తర్వాత చైనా వృద్ధి రేటు ఇంత తక్కువగా నమోదు కావటం ఇదే తొలిసారి. ఒకప్పుడు ‘జెట్ స్పీడ్’తో దూసుకెళ్లిన చైనా ఇప్పుడు ఈ స్థాయికి దిగజారటం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

హైదరాబాద్ ఫార్మా సంస్థ ఘనత

హైదరాబాదుకు చెందిన MSN గ్రూప్ ప్రపంచంలోనే తొలిసారిగా రొమ్ము క్యాన్సర్ మందును ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులోకి తెచ్చింది. పాల్బోసిక్లిబ్ అనే ఔషధాన్ని 75, 100, 125 మిల్లీ గ్రాముల డోసుల్లో రూపొందించింది. ఈ మెడిసిన్ ని ఫైనల్ స్టేజ్ లో ఉన్న రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వినియోగిస్తారు. ఈ మందును పాల్బోరెస్ట్ అనే బ్రాండ్ పేరుతో అమ్ముతోంది. ఎక్కువ సంస్థలు క్యాప్యూల్స్ రూపంలో విక్రయిస్తుండగా తాము అందుబాటులోకి తెచ్చిన ట్యాబ్లెట్ల వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని MSN గ్రూపు పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breast cancer medicine
  • central finance minister meeting
  • china growth rate
  • daily business updates
  • davos

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions