Minister KTR: తెలంగాణలో కైటెక్స్ గార్మెంట్స్ తొలి యూనిట్
Minister KTR: కేటీఆర్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ మంత్రి కేరళకు కూడా కావాలని ఆ రాష్ట్రానికి చెందిన కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ ఎండీ సబూ జాకబ్ అన్నారు. తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్లోని అద్భుతమైన నాయకత్వ లక్షణాలకు అద్దం పట్టే ఒక ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. ఒకానొక సందర్భంలో తాను.. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలా? (లేక) ఉపాధి కల్పన కావాలా? అని మంత్రి కేటీఆర్ని అడిగితే.. ఆయన వెంటనే ఎంప్లాయ్మెంట్ జనరేషనే కావాలని చెప్పినట్లు జాకబ్ గుర్తుచేసుకున్నారు.
read more: IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ కానుక?
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అంటూ అన్ని రాష్ట్రాలూ తమను ఆహ్వానించాయని, అయితే.. మిగతా స్టేట్లతో పోల్చుకుంటే తెలంగాణలో తమను రిసీవ్ చేసుకున్న తీరు చాలా గొప్పగా ఉందని మెచ్చుకున్నారు. కేరళ నుంచి వచ్చేందుకు తమ కోసం ప్రత్యేక విమానాన్ని పంపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన ప్రదేశాలను చూడటానికి ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటుచేశారని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను చూశామని, అక్కడ ఈ ఏడాది జూన్ నాటికి తమ సంస్థ తొలి యూనిట్ని అందుబాటులోకి తెస్తుందని ప్రకటించారు.
రెండేళ్ల కింద జరిగిన ఈ విషయాన్ని ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశంలో కైటెక్స్ గార్మెంట్స్ ఎండీ పేర్కొన్నారు. మొదట్లో తాము వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, పనితీరును గమనించాక ఈ పెట్టుబడులను 3 వేల కోట్ల రూపాయలకు పెంచామని వెల్లడించారు. తమలాగే కేరళలోని ఎంతో మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని సబూ జాకబ్ తెలిపారు.
కేరళలో రాజకీయ వేధింపులు తట్టుకోలేకే బయటి రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతున్నామని, తెలంగాణలో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ వల్ల 28 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. కైటెక్స్ గార్మెంట్స్ సంస్థ కేరళలో చిన్న పిల్లల దుస్తుల రంగంలో 2వ అతిపెద్ద కంపెనీ. 1960లో స్థాపించిన ఈ సంస్థ నిత్యం దాదాపు పది లక్ష వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఇక్కడి యూనిట్ అందుబాటులోకి వస్తే పాతిక లక్షల మేడిన్ తెలంగాణ ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ తెలంగాణ యూనిట్లో 80 శాతం మంది మహిళలకే అవకాశం ఇవ్వనుంది. శిక్షణ అందించి మరీ వారి సేవలను వినియోగించుకోనుంది.
తాజావార్తలు
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
-
Tamil Producers: మే 2వ తేదీన తమిళ్ నిర్మాతల ‘టోకెన్ స్ట్రైక్’
-
Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!