Site icon NTV Telugu

ఏపీలో నేడు తగ్గిన కరోనా కేసులు…

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 69,088 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,535 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,075 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక మొత్తంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,92,191కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 19,60,350కు చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 13,631 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,210 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Exit mobile version