రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పిన ప్రభుత్వం అందులో 4.39 లక్షల ఆర్ టి పీసీఆర్, 19.16లక్షల రాపిడ్ పరీక్షలు ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందినట్లు అలాగే కరోనా పాజిటివ్ రేటు 3.5% ఉంది అని ప్రభుత్వం తెలిపింది. పరీక్షలు ఇంకా పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. మద్యం దుకాణాలను ఆబ్కారీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అని పేర్కొంది. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయించింది. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ చేరవేస్తున్నాం. రేమిడివిసిర్ సరఫరా పర్యవేక్షణకు ప్రీతిమీనాను నోడల్ అధికారిగా నియమించాం అని ప్రభుత్వం తెలిపింది.
కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం
