ఛాన్స్ కోసమే ఇదంతా చేస్తున్నాడా ..? లేక కొత్త ఏమైనా ప్లాన్ ఉందా ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధినేత దృష్టిలో పడేందుకు కొత్త ఎత్తుగడ వేశారా? రాజ్యాంగ పదవిలో ఉన్నా.. విపక్ష పార్టీపై విమర్శలకు కారణం కూడా అందుకేనా? కల సాకారం చేసుకోవడానికి.. ఎక్స్టెన్షన్ పొందడానికి ఆయన ఎంచుకున్న మార్గం వర్కవుట్ అవుతుందా? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఏమా కథ?
త్వరలో ముగియనున్న గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం!
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
- Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
గుత్తా సుఖేందర్రెడ్డి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎంపీగా పనిచేశారు గుత్తా. మంత్రి కావాలన్నది ఆయన చిరకాల కోరికగా అనుచరులు చెబుతుంటారు. టీఆర్ఎస్లో చేరాక ఆ కోరిక తీరుతుందని ఆశించినా.. సామాజిక, రాజకీయ సమీకరణాల వల్ల గులాబీ బాస్ ఫ్రేమ్లో పట్టలేదు. అయినప్పటికీ కేబినెట్ హోదా కలిగిన రైతు సమన్వయ సమితికి అధ్యక్షుడిని చేశారు. కొన్నాళ్లు ఆ పదవిలో నెట్టుకొచ్చినా.. ఆయనలో అసంతృప్తి ఏదో ఒక మూల ఉండిపోయిందట. తర్వాత కాలంలో శాసన మండలి ఛైర్మన్ అయ్యారు. ఇది రాజ్యాంగ పదవి. ఇప్పుడేమో ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగిసే సమయం ఆసన్నమైంది. దీంతో కొత్త టెన్షన్ పట్టుకుందని టీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
జానారెడ్డి, కాంగ్రెస్లపై గుత్తా తీవ్ర విమర్శలు!
మంత్రి కావాలన్న కోరిక నెరవేరాలంటే ఎమ్మెల్యేగానో.. ఎమ్మెల్సీగానో ఉండాలి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్రెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ అధిష్ఠానం కరుణించి మరోసారి ఎమ్మెల్సీని చేస్తే ఆశలు సజీవంగా ఉంటాయి. ఆ ఆశ సజీవంగా ఉండాలంటే కామ్గా ఉంటే కుదరదని భావించారో ఏమో.. ఈ మధ్య విమర్శలకు పదునుపెట్టారు. ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న జానారెడ్డిపైన, కాంగ్రెస్ పార్టీపైనా ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. మండలి ఛైర్మన్ హోదాలో ఉన్నా.. అధిష్ఠానం అటెన్షన్ కోసం కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారని అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు.
గుత్తాకే ఛాన్స్ ఉందని అనుచరులు లెక్కలు!
గుత్తా సుఖేందర్రెడ్డి ఉమ్మడి నల్లగొండ ప్రాంతానికి చెందిన రాజకీయ నేత. ఇదే జిల్లాకు చెందిన శాసన మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం సైతం త్వరలో ముగియబోతోంది. మరో ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. తేరా పదవీకాలం ఇంకా రెండేళ్ల వరకు ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎమ్మెల్సీగా ఎక్స్టెన్షన్ పొందడానికి తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారట గుత్తా.
విమర్శలకు పదును అందుకేనా?
ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు నల్లగొండ జిల్లాకు చెందినవే కావడంతో గుత్తా సుఖేందర్రెడ్డికి ఎక్స్టెన్షన్ ఉంటుందని చర్చ జరుగుతోంది. కాకపోతే మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక తర్వాత మరో లెక్క అన్నట్టు పరిస్థితులు మారిపోయినట్టు గుత్తా శిబిరం అభిప్రాయపడుతోందట. అందుకే విమర్శలకు పదును పెట్టారట. మరి.. కల సాకారం అయ్యేందుకు.. ఎమ్మెల్సీగా ఎక్స్టెన్షన్ పొందేందుకు గుత్తా ఇంకెలాంటి ఎత్తుగడలు వేస్తారో? అవి వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి.

- Tags
- gutha sukender reddy
- TRS
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!