కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డేకి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17న గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీని హీరో శ్రీకాంత్, విజయ్ ఎమ్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Read Also : Radhe Shyam’s First show : ఎప్పుడు? ఎక్కడ ?
పునీత్ రాజ్కుమార్ ఆర్మీ ఆఫీసర్గా నటించిన ఈ మూవీలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించగా, టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, 17న చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయబోతున్నామని హీరో శ్రీకాంత్తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్లో విడుదల చేస్తున్న విజయ్ ఎమ్ తెలిపారు.