ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బేటింగ్ చేయనుంది. అయితే ఆరోగ్య సమస్య కారణాంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఆడటం లేదు. దాంతో జట్టు న్యాయకత్వ బాధ్యతలను మయాంక్ అగర్వాల్ స్వీకరించాడు. అయితే ఈ సీజన్ లో మంచి ఊపులో ఉన్న ఢిల్లీ జట్టును కెప్టెన్ లేని పంజాబ్ ఓడించగలదా… లేదా అనేది చూడాలి.
పంజాబ్ : మయాంక్ అగర్వాల్ (c), ప్రభాసిమ్రాన్ సింగ్ (w), క్రిస్ గేల్, డేవిడ్ మలన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ
ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్