NTV Telugu Site icon

ఈ బీజేపీ ప్రభుత్వం నీరు నింగి, నేల కూడా అమ్మెస్తుంది…

ఈ బీజేపీ ప్రభుత్వం నీరు నింగి నేలను కూడా అమ్మెస్తుంది అని అన్నారు కిసాన్ సభ జాతీయ నాయకులు బల్ కరన్ సింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ అమెస్తాం అంటే కార్మిక లోకం ఉరుకొదు. ఢిల్లీ లో రైతులు ఉద్యమంలో ఎలా జరుగుతోందో మీరు చూసారు. ఇంత పెద్ద అందోళన మునుపెన్నడూ చూసి ఉండరు. ఇప్పుడు అదే తరహా ఉద్యమం   విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతోంది అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకుంటాం. ఈ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అని చెప్పిన ఆయన గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ స్ఫూర్తి తో ముందుకు వెళదాం అని పేర్కొన్నారు.