Site icon NTV Telugu

ఏపీ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 61 మంది మృతి

COVID 19

COVID 19

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కానీ మొదట్లో కంటే ఇప్పుడు కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 8,239 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,93,227 కి చేరింది. ఇందులో 16,85,303 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 96,100 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 61 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 11,824 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 11,135 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,01,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Exit mobile version