తెలంగాణ సర్కార్ పై వి. హనుమంత రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాలకు కూడా స్థలం దొరకదని.. భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుందన్నారు. గత ప్రభుత్వాలు భూములన్ని అమ్మితే ఈ రోజు భూములు ఉండేవా అని ప్రశ్నించారు. అన్ని పార్టీ లు కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. 2019 ఏప్రిల్ 12న జై భీం కార్యకర్తలు పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేశారని..మున్సిపల్ అధికారులు అంబేద్కర్ విగ్రహాన్నిధ్వంసం చేశారని గుర్తు చేశారు. మళ్ళీ మేము విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తే తీసుకువెళ్లి గోశామహల్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని..కల్నల్ సంతోష్ విగ్రహం పెట్టడం సంతోషమే..కానీ అంబేద్కర్ ఏం పాపం చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. అసదుద్దీన్ ఒవైసి, చాడా వెంకట్ రెడ్డి, ఎల్ రమణ, ఉత్తమ్, భట్టితో మాట్లాడాను.. అంబేద్కర్ విగ్రహం కోసం అందరినీ కలుపుకుని పోరాటం చేస్తానని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకే పీసీసీ ఇవ్వాలని వీహెచ్ పేర్కొన్నారు.