బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం “తలైవి”. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో “తలైవి” మూవీ టీం మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. “తలైవి” సినిమా కోసం హైద్రాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలించారని కార్తీక్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి, బ్రిందా ప్రసాద్, యాక్సిస్ బ్యాంక్ పై విబ్రి మీడియా కార్తీక్.
Read Also : రవితేజ ఈడీ విచారణ ప్రారంభం… అతనే కీలకం !
కుట్ర పూరితంగా, మోసం చేస్తూ తనకు తెలియకుండానే విబ్రి మీడియా నుంచి విబ్రి మోషన్ ఫిక్చర్స్ కి 75 లక్షలు బదిలీ చేశారని, ఇవన్నీ 2020 ప్రిభవరి 17, 20వ తేదిలలో జరిగిన అవకతవకలని అతను ఆరోపిస్తున్నాడు. ఈ నెల 6న పోలీసులకు అక్రమ నిధుల మల్లింపుపై పిర్యాదు చేసిన కార్తీక్ ఐ.పీ.సి. 405,406,415,417,418, 420 సెక్షన్స్ పై కేసు నమోదు చేయాలని విజ్నప్తి చేశాడు. సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రంలో జయలలితగా కంగనా రనౌత్, ఎంజి రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. ఏకకాలంలో తమిళ, హిందీ, తెలుగు భాషలలో ఈ చిత్రం చిత్రీకరించబడింది. దీనికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. కేవి విజయేంద్ర ప్రసాద్, మధన్ కార్కీ, రజత్ అరోరా మూడు భాషల్లో కథను అందించారు. “తలైవి”ని విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు.