ప్రభుత్వం భూములు అమ్మితే…అడ్డుకుంటాం : కాంగ్రెస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూములు అమ్మాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో భూముల కోల్పోయాం అనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరిగింది.. నేను కూడా అలాగే చేస్తా అంటే ఎలా ? అని ప్రశ్నించారు. జనం నిన్ను కూడా అలాగే సాగనంపుతారని కెసిఆర్ ను హెచ్చరించారు. అప్పులు ఓ వైపు..భూముల అమ్మకం ఇంకో వైపు రాష్ట్రాన్ని దివాలా తియించడమే అని.. భూముల అమ్మకాన్ని నిలిపి వేయాలని భట్టి డిమాండ్ చేశారు. అమ్మకానికి పెట్టిన భూములు.. అప్పుల వివరాలు జనం ముందు పెట్టాలని..గవర్నర్ ను కలిసి… భూముల అమ్మకాలు ఆపాలని సిఎల్పీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మొండిగా భూములు అమ్మితే… వేలం అడ్డుకుంటామని..భూముల అమ్మకానికి ఎవరూ రావొద్దని హెచ్చరించారు.
2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని… మీరు కొంటె…మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇస్తామన్నారు భట్టి. ప్రజల అవసరాల కోసం ఆస్తులు… అంతే కానీ అమ్మకానికి కాదన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఆస్తుల అమ్మకం సరికాదని… తెలంగాణ వచ్చింది.. ఆస్తులు కాపాడటం కోసమేనని పేర్కొన్నారు. Trs కూడా భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిందని..అప్పుడు వ్యతిరేకించి…ఇప్పుడు ఎలా అమ్మకాలను ఎలా ప్రోత్సహిస్తుందని ఫైర్ అయ్యారు. సిఎస్ సోమేష్ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని.. అందుకే ఆయనకు ఇక్కడి భూముల మీద ప్రేమ ఉండదన్నారు. మా రాష్ట్రం భూముల మీద మాకు ప్రేమ ఉంటుందని పేర్కొన్నారు.
Also Read
- Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!