Ayodhya Ram: రామ్ లల్లా విగ్రహానికి 11 కోట్ల విలువైన కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన గుజరాత్ వజ్రాల వ్యాపారి..
అయోధ్య లో బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరిగింది.. రాముని దర్శన భాగ్యం కోసం దేశ ప్రజలు ఏంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. నేడు భక్తులకు రాముని దర్శనం కల్పిస్తున్నారు.. ఇప్పటికే వేలాది మంది భక్తులు రామ మందిరానికి చేరుకున్నారు.. ఇక రామ మందిరానికి భారీ విరాళాలను కూడా అందిస్తున్నారు.. దేశంలో రామ భక్తులు రాముడికి కానుకలు కూడా సమర్పిస్తున్నారు.. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి కోట్ల విలువైన కిరీటం బహుకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహానికి ‘ముకుట్’ (కిరీటం) విరాళంగా ఇచ్చారు . 11 కోట్ల విలువైన కిరీటాన్ని కొత్తగా నిర్మించిన రామమందిరంలో దేవత కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సూరత్లోని గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్, రాముడికి బంగారం, వజ్రాలు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన 6 కిలోల బరువున్న కిరీటాన్ని సమర్పించారు..
Also Read
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
ముకేశ్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగతంగా అయోధ్యను సందర్శించి ఆలయ ట్రస్ట్ అధికారులకు చాలా చక్కగా రూపొందించిన కిరీటాన్ని సమర్పించారు.. రామమందిరం ప్రధాన అర్చకులు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ధర్మకర్తల సమక్షంలో ముఖేష్ పటేల్ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో కిరీటాన్ని అందజేశారు ..కొత్తగా నిర్మించిన ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహానికి ముఖేష్ పటేల్ కూడా కొన్ని ఆభరణాలను అందించారని విశ్వహిందూ పరిషత్ జాతీయ కోశాధికారి దినేష్ భాయ్ నవియా వెల్లడించారు…
తాజావార్తలు
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!