NTV Telugu Site icon

వైసీపీలో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి..

MLC karimunnisa

గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి చెందడంతో అధికార వైసీపీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా మహ్మద్‌ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో విజయవాడ వైసీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో ఆమె విజయవాడ కార్పోరేషన్‌లోని 56వ డివిజన్‌కు కార్పోరేటర్‌గా కూడా పనిచేశారు.

Also Read : అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం..

అయితే నిన్నరాత్రి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. నిన్న అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరైన కరీమున్నిసా ఇలా మరణించడంతో వైసీపీ నేతలు వాపోయారు. ఆమె మృతిపట్ల వైసీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తి చేశారు.