పవన్ ఫ్రస్టేషన్ అదే..! రాస్కో అంటే ఏంటి..? ఏం చేస్తావు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ ప్రసంగంలో పిచ్చి, ఉన్మాదం పరాకాష్టకు చేరిందనిపిస్తోందని.. కానీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క సలహా ఇచ్చింది లేదన్నారు. ఇంత దిగజారి సంస్కార హీనంగా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా మాట్లాడలేదన్న ఆయన.. ఒక విజన్ లేకుండా… నాకేదో వ్యూహం ఉంది అని గొప్పగా చెప్పుకోడానికి ప్రయత్నం చేశారని సెటైర్లు వేశారు. తెలుగు ప్రజలు పవన్ కల్యాణ్కి గొప్ప స్టార్ డమ్ ఇస్తే దానిని ఉపయోగించుకోలేకపోతున్నారని.. ఇంకా సినిమాల్లో ఉన్నట్లే అనుకుంటున్నాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్కు అసలు కారణం.. పార్టీ పెట్టి 12 ఏళ్లు అయినా ఒక్క ఎంపీపీ కూడా గెలవలేదనే అంటూ ఎద్దేవా చేశారు పార్థసారథి.. ఇక, సినిమా రంగం వల్ల పవన్ కల్యాణ్ బాగుపడ్డాడు.. కానీ, పవన్ వల్ల సినిమా రంగం బాగుపడలేదన్న ఆయన.. తానే సినీ పరిశ్రమ అనే తరహాలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.. ప్రేక్షకులను దోచుకుంటున్న తీరును అరికట్టాలని ఆన్లైన్ సిట్టం పెట్టబోతున్నాం అని స్పష్టం చేశారు. అసలు నీ బుద్ధి తెలిసి నిర్మాతలంతా వచ్చి మంత్రి పేర్నినానిని కలిశారని తెలిపిన మాజీ మంత్రి.. ఫిల్మ్ ఛాంబర్ కూడా మీ మాటలను వ్యతిరేకించిందన్నారు.
రాజు నేను గెలవాలి.. నా రాజ్యాన్ని గెలిపించాలి అనుకుంటాడు… ఓడిపోవాలని అనుకోడన్న పార్థసారథి.. రాస్కో అంటే ఏంటి..? రాస్కొని ఏం చేస్తావు అంటూ ప్రశ్నించారు. జనసైనికులకి చెప్తున్నా… ఈయన్ని పట్టుకుని మీరు వెళితే తోక పట్టుకుని గోదారి ఈదినట్లే అంటూ కామెంట్ చేశారు. వైఎస్ వివేకా హత్య గురించి, కోడి కత్తి గురించి పవన్ మాట్లాడుతాడు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది… అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయావ్ అని నిలదీశారు పార్థసారథి.. మేమే సీబీఐ విచారణ కోరాం.. రాష్ట్రంలో ఈ రెండు సమస్యలే ఉన్నాయా? అని ప్రశ్నించిన ఆయన అవే సమస్యలు అనుకుంటే ఎందుకు ఢిల్లీలో ప్రశ్నించడం లేదన్నారు. నీకు ఈ పిచ్చి ఎవరిదగ్గరి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేసిన ఆయన.. అసలు నువ్వు ఏం ప్రశ్నలు అడిగావో నీకు అర్థం అవుతుందా..? పైగా వర్గ శత్రువులు అంటూ రాజకీయాల్లోకి కొత్త ఫిలాసఫీ తెచ్చాడని మండిపడ్డారు. కమ్మ వారు వైస్సార్సీపీకి వర్గ శత్రువులు కాదు… మాలో మంత్రులు కమ్మ వారున్నారని గుర్తుచేశారు.. బుద్ధి లేకుండా వర్గ శత్రువులు అంటూ కొత్త ఫిలాసఫీ తీసుకురావద్దు అని హితవుపలికారు.. యుద్ధం అంటాడు, సాయుధపోరాటం అంటాడు, అసలు ప్రజాస్వామ్యం అంటే తెలుసా ? అని ప్రశ్నించారు. అసలు అతను ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే కాదని కామెంట్ చేసిన పార్థసారథి.. తుని సంఘటన సమయంలో నువ్వు ప్రభుత్వంలో భాగస్వామివి.. మళ్లీ రైలు సంఘటన వైఎస్సార్సీపీ పని అంటాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
తాజావార్తలు
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
-
Vivo X300e: వివో X300e విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్
-
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
-
Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!