Cricket: ఒకే రోజు రెండు ఘటనలు.. భారత్ ఓటమి, పాకిస్థాన్ విజయం
- శనివారం క్రికెట్ ప్రపంచంలో రెండు పెద్ద సంఘటనలు
- ఇంగ్లండ్ను ఓడించి టెస్ట్ సిరీస్ను 2-1తో గెలుచుకున్న పాకిస్తాన్
- 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండవ మ్యాచ్లో న్యూజిలాండ్ పై భారత్ ఓటమి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 అక్టోబర్ 26న (శనివారం) క్రికెట్ ప్రపంచంలో రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు.. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి టెస్ట్ సిరీస్ను 2-1తో గెలుచుకుంది పాకిస్తాన్. మరోవైపు.. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండవ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించి కైవసం చేసుకుంది. కివీస్తో జరిగిన ఈ టెస్టు సిరీస్ను కోల్పోయిన భారత్కి ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఫైనల్ చేరడం సవాలుగా మారింది.
Read Also: IND vs NZ: టెస్ట్ సిరీస్ను కోల్పోవడం నిరాశపరిచింది.. ఓటమికి కారణం చెప్పిన రోహిత్
Also Read
- Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
భారత్ ఓటమి.. పాకిస్థాన్ విజయం తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో జట్ల స్థానం గురించి తెలుసుకుందాం. కివీస్ జట్టుతో భారత్ వరుసగా రెండు టెస్టు మ్యాచ్ల్లో ఓడిపోయినా.. భారత్ ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలోనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ల్లో భారత్ 8 గెలిచింది.. 4 ఓడిపోయింది.. ఒక మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుతం భారత్ గెలుపు శాతం 62.82గా ఉంది. ప్రస్తుతం కివీస్ జట్టు 10 మ్యాచ్ల్లో 5 గెలిచి 5 ఓడిపోయి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు విజేత శాతం 50.00గా ఉంది.
Read Also: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఇంగ్లండ్పై పాకిస్థాన్ వరుసగా రెండు టెస్టు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో 4 గెలిచింది. 6 ఓడిపోయింది.. ఈ జట్టు ఓటమి శాతం 33.33గా ఉంది. ఇంగ్లండ్ జట్టు 19 మ్యాచ్లలో 9 గెలిచింది. 9 ఓడిపోయింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ జట్టు విజేత శాతం 40.79గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక మూడో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..