Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంటకాల్లో బిర్యానీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు. ఇందులోనూ అనేక వెరైటీలు ఉంటాయి. చాలా మంది తమ ఇష్టాలకు అనుగుణంగా పలు రకాల చికెన్ బిర్యానీ వెరైటీలను తింటుంటారు. అది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. బిర్యానీ ప్రియులు కచ్చితంగా ఆ వంటకాన్ని ఇష్టపడతారు. అయితే, మీరు ఎప్పుడైన ‘ఇల్యూజన్ బిర్యానీ’ ట్రై చేశారా?. ఈ ప్రత్యేకమైన బిర్యానీ ఢిల్లీ కేఫ్లో వడ్డిస్తారు. దీనిని “ఖయాలీ పులావ్”,”మసాలా భాత్” అంటూ పేర్లు కూడాపెడుతున్నారు నెటిజన్లు.
Also Read: Baby boy sold: నవజాత శిశువును అమ్మేసిన తల్లి
ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో భ్రమలకు కొత్తేమీ కాదు. దాదాపు ప్రతిరోజూ మనం ఏదో ఒక రకమైన ట్రిక్ లేదా భ్రమ ఆధారంగా వైరల్ పోస్ట్లను చూస్తాం. కొన్నిసార్లు వాటిని చూసి ఆశ్చర్యపోతాం. అవి ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ హోటల్ లో బౌల్ లో బిర్యానీ మసాలాలు వేశాడో వ్యక్తి. బిర్యాలీలో వేసే అన్ని రకాల దినుసులు వేశాడు. అనంతరం దానికి మూత పెట్టి.. చేతిలో తీసుకుని కాసేపు మ్యాజిక్ చేశాడు. అది కాస్తా వేడి వేడి బిర్యానీగా బయటకొచ్చింది.
Also Read
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
ఒక వ్యక్తి బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల సాదా బియ్యం, సాధారణ బిర్యానీ మసాలాలు, వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన గుడ్డు కలుపుతున్నట్లు వీడియో చూపిస్తుంది. అతను కొన్ని సెకన్ల పాటు కూజాను కదిలించాడు. అతను దానిని తెరిచి, దానిలోని పదార్థాలను ప్లేట్లోకి వడ్డించాడు. దాని నుండి బిర్యానీ లాంటి బియ్యం రావడం కనిపిస్తుంది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి ‘ఇల్యూజన్ బిర్యానీ’ అని పేరు పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు వివిధ రకాలు స్పందిస్తున్నారు. ఈ రీల్కి ఇప్పటివరకు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కొంతమంది వినియోగదారులు ఈ వంటకాన్ని ప్రదర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బిర్యానీ అని పిలవలేమని పేర్కొన్నారు. బియ్యం గింజలు ఇప్పుడు సాదాగా ఉండవు, మసాలా కారణంగా పసుపు రంగులో ఉంటాయి. అయితే అది ఎలా సాధ్యం? కామెంట్స్లో నెటిజన్లు తమ సిద్ధాంతాలను పంచుకున్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!