ప్రపంచ టూరిస్ట్ స్పాట్గా ..శ్రీ రామానుజుల విగ్రహ ప్రాంగణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముచ్చింతల్ లోని శ్రీరామానుజుల విగ్రహ ప్రాంగణానికి వీఐపీల తాకిడి ఎక్కువయింది. సమసమాజ నిర్మాత శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లు శంషాబాద్ మండలం ముచ్చింతల్ చినజీయర్స్వామి ఆశ్రమంలో వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ముచ్చింతల్లో ఫిబ్రవరి 5వ తేదీన నరేంద్రమోదీ పర్యటన ఖరారైనట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆశ్రమానికి సమాచారం అందింది.
రూ.వెయ్యి కోట్లతో రూపుదిద్దుకుంటున్న 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి ప్రధాన మందిరంలో 120కిలోల బంగారంతో రూపొందిన 54అంగుళాల రామానుజుల నిత్యపూజామూర్తిని 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలిదర్శనంతో ప్రారంభిస్తారు. 35ఎకరాల్లో 144యాగశాలల నిర్మాణం పూర్తిచేశారు. 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకములు స్వర్ణ శ్రీరామానుజ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Also Read
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తు ఉన్న పంచలోహ విగ్రహంగా శ్రీరామానుజుల విగ్రహం తన విశిష్టతను చాటుకోనుంది. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను 2700 శిల్పులు ఈరాతి కట్టడాన్ని సిద్ధం చేశారు. విగ్రహం 108అడుగులు ఉండగా దిగువన భద్రవేదిక 54అడుగులు, పద్మపీఠం 27అడుగులు, స్వామిచేతిలోని త్రిదండం 27అడుగుల ఎత్తు ఉన్నాయి. విగ్రహం బరువు 1800టన్నులు. విగ్రహ ఆవిష్కరణ సమయం దగ్గర పడుతుండటంతో చినజీయర్స్వామి ఆశ్రమానికి వీఐపీల తాకిడి ఎక్కువైంది. ఆశ్రమంలో ఘనంగా గోపూజ నిర్వహించారు. పూజలో పాల్గొన్నారు తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న రోడ్లను, ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. సంక్రాంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రులు, చినజీయర్ స్వామి, రామేశ్వర రావు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..