వరికి ప్రత్యామ్నాయం ఏంటి? సర్కార్కి క్లారిటీ వుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి వేయవద్దని ప్రత్నామ్నాయ పంటలు వేయాలని స్వయంగా కేసీఆర్, మంత్రులు పదే పదే చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతూనే వున్నారు. అయితే రైతులు మాత్రం చాలా చోట్ల వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వరిపంట వేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది.
ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసింది తప్ప ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహనా కల్పించడం లేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం గురించి చెప్పే మంత్రులు సైతం ఆయా పంటలకు సంబంధించిన విత్తనాలను కూడా అందుబాటులో ఉంచడంలేదని రైతులు మండిపడుతున్నారు. వరి స్థానంలో వేరే పంటలు వేస్తే లాభం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా, వరిపంటకి అసలు ప్రత్యామ్నాయం లేదని రైతులు చెబుతున్నారు.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలపై ఒక పాలసీని తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుద్ధి లేదని రైతులు తమ గోసను వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. టీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న ఆధిపత్య డ్రామాలో అంతిమంగా నష్టపోతున్నది రైతులే. కళ్ళాల దగ్గర రైతులు గుండెపోటుకి గురవుతున్నారు.
రైతుల్లో వరి పండించేదానిపై ఒక స్పష్టత లేదు. అసలు వరికి సమానమయిన, మంచి ఆదాయాన్ని ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలపై వారికి అవగాహన లేదు. ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు చొరవ తీసుకుని ప్రత్యామ్యాయ పంటలపై ఒక క్లారిటీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతులు వరివేయవద్దని చెబుతున్న నేతలు తమ పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఏం వేస్తున్నారో క్షేత్రస్థాయిలో చూపించాల్సి వుంది. తాజాగా ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్పై బాంబు పేల్చారు. రైతుల్ని వరి వేయవద్దని చెబుతున్న సీఎం కేసీఆర్, ఆయన బంధువులు తమ ఫాం హౌస్ లో వందల ఎకరాల్లో పండిస్తున్నది వరి అంటూ ఫోటోలు విడుదల చేశారు.
అంతేకాదు ఛత్తీస్ ఘడ్ రావాలని హరీష్ రావు, కేటీఆర్కి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. వరి కాకుండా ఇంకో పంట సాగు చేస్తే… ఎకరాకు 9 వేల సాయం చేస్తుంది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. మీరిద్దరూ వస్తే అక్కడి సీఎంతో మాట్లాడి అతిథిగా తీసుకెళ్తానన్నారు. సీఎం కెసిఆర్ పండించిన పంట ఎవరు కొంటున్నారు? ఎంతకు కొంటున్నారు అనేది కూడా చెబుతానన్నారు రేవంత్. పండింది తాలా.. గట్టి ధాన్యమా అని కూడా చూపిస్తానన్నారు రేవంత్ రెడ్డి. త్వరలో ఛత్తీస్ ఘడ్ కి మీడియా వాళ్ళను తీసుకెళ్తానన్నారు రేవంత్ రెడ్డి. వరికి ప్రత్యామ్నాయం విషయంలో ప్రభుత్వం రైతుల్ని చైతన్య పరచాల్సిన ఆవశ్యకత వుంది. ఏ పంట వేస్తే ఎన్నిరోజుల్లో కోతకు వస్తుంది? ఆ ప్రత్యామ్నాయ పంటకు మార్కెటింగ్ సౌకర్యం ఎలా వుందో తెలియచేయగలిగితే రైతులు వరిని వదిలి వేరే పంటలపై ఫోకస్ పెడతారు.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!