ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్యకేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్రెడ్డి, శంకర్రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఎస్పీకి వెల్లడించారు.
అంతేకాకుండా నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు. దీనిపై స్పందించిన ఎస్పీ ఫకీరప్ప.. గంగాధర్రెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అధికారిగా డీఎస్పీని నియమించినట్లు తెలిపారు. వారం రోజుల్లో విచారణ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. దీనితో పాటు గంగాధర్తో పాటు అతడి కుటుంబానికి రక్షణ కల్పించినట్లు పేర్కొన్నారు.