NTV Telugu Site icon

బిగ్‌ న్యూస్‌ : బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం…

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతోనే టీఆర్‌ఎస్‌ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 753 బ్యాలెట్‌ ఓట్లను లెక్కించగా అందులో టీఆర్‌ఎస్‌కు ఓట్లు ఆధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లలో 503 టీఆర్ఎస్ కు రాగా, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అనంతరం హుజురాబాద్‌ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తరువాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు హుజురాబాద్‌ బాద్‌షా ఎవరన్నది ఖరారు కానుంది.