ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అయితే ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నట్లు, అవసరమైతే శాఖాధిపతుల సలహా తీసుకోవాలని తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇతర విభాగాల సమాచారం అవసరమైనప్పుడు సహకారం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో పిల్స్ పై విచారణను సీజే జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముగించింది.
ఆర్టీఐపై ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
![](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2021/10/cs-somesh-1024x768.jpg)