సీఎం కేసీఆర్ డిమాండ్.. కొత్త విద్యుత్ చట్టం రద్దు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై కార్మికులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళనతో ఉన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాము రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినా కేంద్రం వినడం లేదని, బావుల దగ్గర కరెంటు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందన్నారు. తాము విద్యుత్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్లో సాగు చట్టాలను రద్దు చేసే సమయంలోనే దీన్ని కూడా రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మరోవైపు ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని… అలాగే బీసీ కులగణన చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. లెక్కలు దాచిపెట్టాలని భావించడం ఏంటని ప్రశ్నించారు. పారదర్శకత కావాలంటే కేంద్రం.. ఎవరి జనాభా ఎంత ఉందో లెక్క తేల్చాలన్నారు. ఎందుకు వారి జనాభా దాచిపెట్టాలని.. ఇదేం బ్రహ్మపదార్థం కాదని కేసీఆర్ నిలదీశారు.
Also Read
Read Also: అమరులైన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా: సీఎం కేసీఆర్
రైతులకు మేలు కలిగేలా కనీస మద్దతు ధరను కేంద్రం ప్రకటించాలని కేసీఆర్ సూచించారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. కరోనా సంక్షోభం సమయంలోనూ రైతులను ఆదుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు గుర్తుచేశారు. మరోవైపు కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వాటాలు తేల్చేందుకు ఇన్ని సంవత్సరాలు పట్టకూడదని, ఇందులో కేంద్రం విఫలమైందన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిని కలిశామని, మళ్లీ వెళ్లి కలుస్తామన్నారు. జలాల వాటాలపై త్వరగా తేల్చకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!