ఎయిర్ ఇండియాను టాటా సన్స్ హస్తగతం చేసుకోబోతున్నది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం టాటా సన్స్ సంస్థ వేసిన బిడ్ ఒకే అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వంకు 75 శాతం వాటా ఉన్నది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. 2018 లో ఒకసారి కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మేందుకు ప్రయత్నం చేసింది. కానీ, సరైన బిడ్ రాకపోవడంతో అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నది.
టాటా చేతుల్లోకి ఎయిర్ ఇండియా…?
