నేడు దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం : సీఎం కేసీఆర్ డుమ్మా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. సౌత్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్గా ఉండగా… ఏపీ ముఖ్యమంత్రి YS జగన్… వైస్ ఛైర్మన్గా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ఆతిథ్య నిర్వహణలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఇవాళ తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు.. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ సీఎంలతో పాటు పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కావాల్సిఉంది.
పలువురు కేంద్ర మంత్రులు, ప్రతినిధులు, అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. SZC ఉపాధ్యాక్షుడి హోదాలో ఏపీ సీఎం జగన్ కూడా రానున్నారు.ఈ ఏడాది మార్చిలోనే ఈ మీటింగ్ జరగాల్సి ఉన్నా… అప్పుడు అమిత్ షా అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఇవాళ్టికి రీ షెడ్యూల్ అయిన ఈ మీటింగ్కు తెలంగాణ సీఎం కేసీఆర్కు బదులు.. ఆ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై .. ఏపీ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించనున్నారు సీఎం జగన్. మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించి కేంద్ర సహాయాన్ని కోరనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అజెండాలో పొందుపరిచారు.
Also Read
- BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- Bhopal: భోపాల్లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్కు వెళ్లాక ప్రియుడితో స్టాల్కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎఫ్డీ ఖాతాల స్తంభన.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ సమావేశంలో ప్రస్తావించనున్నారు సీఎం జగన్. కేఆర్ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశం, నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనలు వంటి కీలక అంశాలపై పూర్తి సమాచారంతో ఏపీ అధికారులు సిద్ధం అయ్యారు. ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాలపై కూడా గట్టిగా సమాధానం ఇచ్చే విధంగా ప్రభుత్వం గణాంకాలతో సహా తమ వాదన వినిపించటానికి రెడీ అయింది, సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగేటట్లు చూడాలన్న ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ విషయంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!