Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Somasila Siddeshwaram Bridge Become A Dream

15 ఏళ్ళ నాటి నిర్లక్ష్యం.. కానరాని పరిష్కారం

Published Date :January 16, 2022 , 9:59 pm
By NTV WebDesk
15 ఏళ్ళ నాటి నిర్లక్ష్యం.. కానరాని పరిష్కారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పదిహేనేళ్ల క్రితం కృష్ణానదిలో మంచాలకట్ట వద్ద నాటుపడవ మునగడంతో 61 మంది జలసమాధి అయ్యారు. నదిపై వంతెన నిర్మిస్తామని అప్పట్లో ప్రభుత్వం హడావుడి చేసినా పనులు మాత్రం శిలాఫలకాలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రమాదం మిగిల్చిన విషాదానికి తోడు పాలకులు నిర్లక్ష్యం స్థానికులను వెక్కిరిస్తోంది.

పదిహేనేళ్ల క్రితం జరిగిన విషాదం ఇంకా ఆ ప్రాంతాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రస్తుత నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల సందర్భంగా జరిగిన పడవ విషాదం ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు గుర్తుచేసుకుంటున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు కర్నూలు జిల్లా నుంచి భక్తులు బయలు దేరారు. రోడ్డుమార్గం లేకపోవడంతో నాటు పడవను ఆశ్రయించారు. అది కాస్త ప్రమాదానికి గురవ్వడంతో 61 మంది జల సమాధి అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. సోమశిల-సిద్ధేశ్వరం వంతెనను 110 కోట్ల రూపాయలతో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.

మంచాలకట్ట విషాదం

2007 ఫిబ్రవరి 26న వంతెన నిర్మాణానికి 81 కోట్లు విడుదల చేశారు. 2009 ఫిబ్రవరి 13న వంతెన నిర్మాణ పనులకు సంబంధించి ఫైలాన్‌ను ఆవిష్కరించారు. వంతెనకు అనుసంధానంగా కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 82కోట్ల వ్యయంతో డబుల్‌లైన్ రహదారి ని నిర్మించాలని నిర్ణయించారు. మూడేళ్లలో వంతెన పూర్తి చేయాలని, లేదంటే ఫైన్ అపరాద రుసుం చెల్లించాలని నిబంధన పెట్టడంతో కాంట్రాక్టును దక్కించుకున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి కోర్టుకెళ్లారు. కోర్టు స్టే ఇవ్వడంతో నిర్మాణ పనులు పెండింగ్‌లో పడ్డాయి. కోర్టు స్టేకు తోడు, విభజన వివాదం రేగడంతో వంతెన నిర్మాణం పనులు ముందుకు సాగలేదు. శిలాఫలకాలు, పైలాన్ తప్ప ఎలాంటి పనులు జరగకలేదు. దీంతో ఇప్పటికీ ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పడవల్లోనే ప్రయాణిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే బాలరిష్టాలు దాటని ఈ వంతెన ఇక రాష్ట్ర విభజన తర్వాత అంతరాష్ట్ర సమస్యగా మారింది. తెలంగాణలోని పూర్వ మహబూబ్ నగర్, ఏపీలోని కర్నూలు జిల్లాలను కలిపే వంతెనగా ఇది మారడంతో వంతెన నిర్మాణాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కనపెట్టాయి. వంతెన నిర్మాణం జరిగితే కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య దూరం మరింత తగ్గడంతోపాటు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వంతెనతో పాటు రహదారి నిర్మాణాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు.

సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మిస్తే కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య ప్రయాణదూరం తగ్గుతుంది. వెనకబడ్డ కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి వంతెనతో పాటు డబుల్‌ లైన్ రహదారి నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 15 years problem
  • ap
  • manchalakatta tragedy
  • Nagarkurnool
  • somasila-siddeswaram bridge

తాజావార్తలు

  • Sajjala Ramakrishna Reddy: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండండి.. ఓట్లు తొలగించకుండా జాగ్రత్త..!

  • Jana Sena Party: జనసేన ఆవిర్భావ దినోత్సవం రద్దు.. కారణం ఏంటంటే..?

  • Karuppu: స్టార్ హీరోపై కేసు వేయనున్న డైరెక్టర్? కోలీవుడ్‌లో కలకలం రేపుతున్న ‘కరుప్పు’ వివాదం!

  • VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..

  • Rashmika Mandanna: మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి: రష్మిక

ట్రెండింగ్‌

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..

  • Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions