మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. క్రాంతి-మమత దంపతులకు మూడు నెలల చిన్నారి పాప ఉంది. పాపకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత శనివారం నాడు పాపను ఇంటికి తీసుకువచ్చారు.
Read Also: స్టేజిపైనే లవర్ కు ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ
అయితే శనివారం రాత్రి వాళ్లు నిద్రిస్తున్న సమయంలో ఓ పాము వాళ్ల ఇంట్లోకి చొరబడింది. అది పాప నిద్రిస్తున్న దుప్పట్లోకి దూరింది. తొలుత పాము పాపను కాటేయడంతో చిన్నారి గుక్కతిప్పుకోకుండా ఏడవడం ప్రారంభించింది. ఏమైందో అని కుటుంబసభ్యులు లేచి చూడగా.. అంతలోనే పాము తల్లిదండ్రులను కూడా కాటేసింది. ఈ ఘటనలో పాప మృతి చెందింది. తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా చిన్నారి మృతిలో ఆ కుటుంబంతో విషాద ఛాయలు నెలకొన్నాయి.